అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్ 2 బ్యానర్ పై బన్ని వాసు, వాసు వర్మ నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా అఖిల్, స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా అధికారకంగా వెల్లడైంది.
అయితే సైరా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి వెంట వెంటనే పవన్ కళ్యాణ్, అఖిల్ సినిమాలని ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా కాస్త సమయం ఉండగా ముందు అఖిల్ సినిమా ప్రారంభించేందుకు సురేందర్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నాడు ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరోలకి లక్కీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న అక్కినేని అఖిల్ కి జంటగా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.
కాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక తాజా అప్డేట్ అక్కినేని ఫ్యాన్స్ కి ఊపునిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ కోసం హాలీవుడ్ టెక్నీషియన్ లతో వర్క్ చేసిన సురేందర్ రెడ్డి ఇప్పుడు అఖిల్ సినిమాకి వారినే రంగం లోకి దింపబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా యాక్షన్ స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుండటంతో తప్పకుండా ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడట.
చాలా కాలంగా యాక్షన్ ఇమేజ్ కోసం అక్కినేని అఖిల్ చాలానే ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖిల్ నటించిన అఖిల్, హలో సినిమాలలోల్లో యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా వుండేలా ప్లాన్ చేసినా ఆ సినిమాలు రెండు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా మిగలడంతో అక్కినేని అఖిల్ స్టామినా ఏంటో ఎవరికీ తెలియలేదు. అందుకే ఈ సారి సూరి పక్కాగా ప్లాన్ చేసి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ దింపబోతున్నాడట. ఇక ఈ సినిమాకోసం దాదాపు 50 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!