ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ ఇది ఆయన అసలు పేరు కానీ వృత్తిపరంగా ఆయనకు గుర్తింపు తెచ్చింది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పేరు. మాటల మాంత్రికుడు గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు త్రివిక్రమ్. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేశారు. అందులో బంగారు పతాకాన్ని సాధించారు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కానీ సాహిత్యంపై ఉన్న ఆసక్తితో ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించారు.
స్వయంవరం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి రచయితగా పరిచయమయ్యారు త్రివిక్రమ్. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు వంటి సినిమాలకు కథా స్క్రీన్ ప్లే రచయితగా పని చేశారు. ఆ తర్వాత అతడు ,జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. కాగా లేటెస్ట్ గా ఎన్ టీ ఆర్ తో ఓ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా తో తన సెంటిమెంట్ నీ పక్కన పెడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్తారింటికి దారేది సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన అలా వైకుంఠపురం వరకు ‘ అ ‘ అక్షరాన్ని సెంటిమెంట్ గా పెట్టుకొని టైటిల్స్ ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. మధ్యలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి పక్కన పెడితే 2013 నుంచి 2020 వరకు మొత్తం ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ వచ్చారు. ఇక త్వరలో సెట్స్ మీదకు రానున్న ఎన్టీఆర్ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మార్చ్ లో పట్టాలు ఎక్కబోతుండగా ఇప్పుడు టైటిల్ విషయంలో త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ సినిమాకు రాజా వచ్చినాడు అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అసలు టైటిల్ ఏంటన్నది మాత్రం ఇంకా యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.