Kasi : కాశీ వెళ్లాలని
కాశీనగరం తో సమానమైన పుణ్య స్థలం, అక్కడ ఉన్న విశ్వేశ్వర స్వామి (vigneswara swamy ) వారి లింగానికి సమానమైన శివస్వరూపం మరి ఎక్కడా లేదు. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేస్తే ,సర్వపాపాలు తొలగిపోవడం తో పాటు పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అని నమ్ముతారు. హిందువు గా జన్మించిన ప్రతిఒక్కరు మరణించే లోపు ఒక్కసారి అయినా కాశీ వెళ్లాలని కోరుకుంటారు. అంతటి పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ. కాశీకి వెళ్లినవారంతా అక్కడ తమకు ఇష్టమైన కాయ, ఫలం వదిలేయాలని అంటుంటారు. అందరు వదిలి వస్తుంటారు కూడా. అసలు ఇలా ఎందుకు చేయాలి ?దీనివెనుకున్న అర్ధం ఏమిటి అనేది తెలుసుకుందాం.
Kasi : విశ్వనాథుడి దర్శనం
నిజానికి కాశీలో (kasi ) కాయో,పండో వదిలేయామని శాస్త్రం లో ఎక్కడ చెప్పబడలేదు. శాస్త్రం చెప్పిన అసలు విషయాన్ని కొందరు మిడి మిడి జ్ఞానం తో అలా మార్చేయడం జరిగింది. శాస్త్రం చెప్పినదాని ప్రకారం,కాశీ కి వెళ్లి గంగా నదిలో స్నానం చేసిన వారు తమకున్న కాయాపేక్ష, మరియు ఫలాపేక్షను గంగలోనే వదిలిపెట్టి స్వచ్ఛం గా విశ్వనాథుడి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి రావాలని దాని అర్ధం. అయితే ఇక్కడ కాయాపేక్ష, ఫలాపేక్ష అంటే అర్ధం.. కాయం అనగా శరీరం…శరీరంపై ఉన్న ఆపేక్షని, ఫలం అంటే కర్మఫలం…కర్మఫలము మీద ఆశని పూర్తిగా వదిలిపెట్టి.. స్వచ్ఛమైన భక్తితో ఆ పరమేస్వరుడి చింతనతో జీవితం సాగించాలి అని అర్ధం.
యథాతథం గా
రాను రాను అది కాస్త తినే కాయ, పండుగా రూపాంతరం చెందింది.ఒకసారి ఆలోచించండి…కాశీ వంటి పుణ్యక్షేత్రానికి వెళ్లి ఇష్టమైన కాయగూరలు మరియు పండ్లు, ఆకులు వంటివి గంగలో మునిగి వదిలేయడం వలన అందులో పుణ్యం ఎందుకు ఉంటుంది? శాస్త్రం చెప్పినదాన్ని యథాతథం గా అర్థం చేసుకుని ఆ క్షేత్ర దర్శనం చేసుకుని అక్కడ ఉన్న సంప్రదాయం పాటిస్తే అసలైన ఆధ్యాత్మిక చైతన్యం వృద్ధి చెందుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?