సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీ గురించి అంత ఈజీగా ఎక్కడా చెప్పడు. సినిమాల్లో ఎంతో చలాకిగా మాట్లాడే ఈ హీరో.. నిజ జీవితంలో అవసరానికి మించి మాట్లాడరు. తన వ్యక్తిత్వమే ఆయనను ఆ స్థానంలో ఉంచిందని అందరూ అంటుంటారు. విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదివారం తన ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ కు వెళ్లాడు. ఎక్కడికి వెళ్లారో చెప్పలేదు కానీ.. ఒక సముద్ర తీరంలో ఉన్న సిటీకి వెళ్లారని సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న ఫొటోలను చూస్తే అర్థం అవుతుంది.
మాస్కు ధరించి ఎయిర్ పోర్ట్ లో సూపర్ స్టార్ ఉన్న ఫొటో ఆదివారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.ఈ ఫొటోలో సూపర్ స్టార్ ఫేస్ మాత్రం కనిపించలేదు. కానీ, ఆయన కొత్త హెయిర్ స్టయిల్ లో కనిపించారు. ఇది ఆయన అభిమానులను చాలా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఒక ఇన్ ట్రెస్టింగ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.
సితార పోస్ట్ చేసిన ఫొటో ఏంటంటే.. ఫ్లైట్ జర్నీలో నమ్రత నిద్రపోతున్న ఫొటో. దీన్ని సితార తీసింది. దాన్ని సితార సోషల్ మీడియాలో షేర్ చేసింది. షేర్ చేస్తూ.. మా అమ్మ సాధారణంగా ఎప్పుడూ నిద్రపోదు. ఒకవేళ నిద్రపోతే తను నా ఏంజల్ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ విషయం అనోటా ఈ నోట పడుతూ.. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
సితారాకు తల్లి అంటే ఎంత ప్రేమో అని కొందరు. స్వీట్ మదర్ అండ్ డాటర్ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే సితార ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తన తండ్రి మహేష్ బాబ్ యాక్ట్ చేసిన చిత్రంలోని సాంగ్ కు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో అందరి చూపులను తన వైపు తిప్పుకుంది.