“రౌద్రం రణం రుధిరం”.. తెలుగు ప్రేక్షకులతో పాటు దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం అన్ని చిత్ర పరిశ్రమలలోని దర్శక, నిర్మాతలు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేసిన టీజర్ గురించే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం” నుంచి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పై కట్ చేసిన టీజర్ రిలీజ్ కానుంది.
అయితే రాం చరణ్ చరణ్ టీజర్ వచ్చినప్పటి నుంచి భీమ్ టీజర్ పై ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ టీజర్ ఎలా ఉంటుంది భీమ్ గా ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు అన్న విషయాలు ప్రేక్షకుల్లో వేడి పెంచేస్తున్నాయి. కాగా మాస్ ఎలివేషన్ సీన్స్ .. చరణ్ వాయిస్ ఓవర్ అలాగే తారక్ స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతున్నాయో ఒక అంచనాకి వచ్చి ఆతృత పెరిగిపోయింది.
అయితే చరణ్ టీజర్ లో కొంత మేర కథ చెప్పిన జక్కన్న భీమ్ టీజర్ తో మరికొన్ని అంశాలు రివీల్ కానున్నాయట. పంచభూతాలలో నిప్పు.. నీరు అత్యంత శక్తివంతమైనవి. అంతేకాదు రెండు ఒకదానికి ఒకటి పూర్తి భిన్నమైనవి అన్న విషయం కూడా తెలిసిందే. అలాంటి ఈ రెండు శక్తివంతమైన అంశాలకు ప్రతీకగా ఈ ఇద్దరినీ మొట్టమొదటి పోస్టర్ నుంచి రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయ చాలా మందికి అర్థమైంది. అలాగే మోషన్ పోస్టర్ టీజర్ లో కూడా నిప్పు నుంచి అల్లూరి, నీటి నుంచి భీమ్ లను పరిచయం చేయడం తో కూడా కథ ఎలా ఉండబోతుంది అన్నది హింట్ ఇచ్చారు.
కాగా ఇప్పుడు భీమ్ గా తారక్ ను రివీల్ చేసే టీజర్ లో నీటికి ప్రతీకగా ఎక్కువ షాట్స్ ను చూపిస్తారని తెలుస్తుంది. విజన్ కూడా బ్లూ గా ఉంంటుందని తాజాగా చరణ్ ట్వీట్ చేసిన వీడియో క్లిప్ లో నీటి నుంచి ఈటెను తీసే షాట్ ద్వారా హింట్ ఇచ్చారు. అంటే పంచభూతాలలో అత్యంత శక్తివంతమైన నిప్పు, నీరు కి ప్రతీకగా అత్యంత శక్తివంతంగా రాజమౌళి ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులును వెండితెర మీద ఆవిష్కరించబోతున్నారని అర్థమవుతోది. దాదాపు భీమ్ టీజర్ తో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది అని అంటున్నారు.