Banana : చూడటానికి మంచి పసుపు రంగులో:
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ బాగా పండిన అరటి పండు ఒకటి తినాలి. దీనితో శరీరానికి కావలిసిన శక్తి అందుతుంది, అయితే ఇక్కడ మనం తెలుసుకోవల్సిన విషయం ఏమిటంటే… బయట కొన్ని చోట్ల అమ్మే అరటి పండ్లను కాల్షియం కార్బైడ్ , ఏ తిలేన్, తో పాటు ఏ తిపాల్ అనబడే రసాయనాలను వాడి పండిస్తున్నారు. ఆ పళ్లు చూడటానికి మంచి పసుపు రంగులోఉండి చూపులను ఆకర్షిస్తాయి. వీటిని తినడం వల్ల మన శరీరంలోకి కార్శినోజర్లు అనే ఎంజైములు చేరి అనేక రకాల వ్యాధుల కు కారణం అవుతున్నాయి. ఇలాంటి పళ్ళను తినే కన్నా తినక పోవడమే మంచిది అని గుర్తు పెట్టుకోండి.
Banana :పసుపు రంగులో ఉండి వాటి తొడిమ:
సహజ సిద్దంగా పండిన పళ్లు, కృత్రిమంగా పండించిన పళ్లకు గల తేడాలు చూస్తే సహజంగా పండినవి పండు తో పాటు తొడిమ కూడా పసుపు రంగులో ఉంటుంది. అదే రసాయనాలు వాడి పండించినవి అయితే పండు పసుపు రంగులో ఉండి వాటి తొడిమ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాబట్టి అరటి పళ్ళు కొనేటప్పుడు ఈ తేడాను గమనించుకోవాలి. కొన్న అరటి పండ్లు చాలా రోజులు తాజాగా ఉండాలి అంటే ఇలా చేయండి. మనం అరటి పండ్లను కొన్నప్పుడు వాటిని ప్లాస్టిక్ కవర్స్లో పెట్టి ఇస్తుంటారు. చాలా మంది ఇంటికి తెచ్చినతర్వాత కూడా వాటిని కవర్ లోనే ఉంచేస్తారు. ఇలా కవర్ లో ఉంచడం వలన పండ్లు త్వరగా పాడవుతాయి. కాబట్టి పండ్లను కవర్ నుండి బయటకు తీసి విడిగా పెట్టుకోవాలి.
గాలి తగిలేలా వేలాడదీస్తే:
అరటి పండ్లను ఫ్రీజ్ లో కూడా పెట్టకూడదు. ఎండ తగలని చోట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచేస్తే సరిపోతుంది. అరటి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే వాటిని ఇంటికి తీసుకురాగానే గుత్తి నుంచి ఒక్కొక్కటిగా వేరు చేయాలి. ఇలా చేయకపోతే గుత్తిలోని ఒక్క పండు పాడైన మిగతావన్నీ కూడా పాడైపోతాయి.
చాలా మంది అరటి పండ్లను ఇతర పండ్లతో కలిపి నిల్వ చేస్తుంటారు. ఇలా చేయడం వలన ఇతర పండ్ల నుంచి విడుదలయ్యే ఇథైలీన్ గ్యాస్ అరటిని త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ముఖ్యంగా యాపిల్స్, టమాట అవకాడో, కివిస్, కి దూరంగా ఉంచాలి. అరటి పండ్లు త్వరగా పాడవకుండా ఉండటానికి వాటిని గాలిలో వేలాడదీయాలి.ఏదైనా పాత్రల్లో, బుట్టల్లో పెట్టడం కన్నా కూడా బాగా గాలి తగిలేలా వేలాడదీస్తే మాత్రం ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?