Different Marriage: సాధారణంగా పెళ్ళంటే కళ్యాణమండపంలోనో, గుడిలోనూ, రిసార్టులోనో చేసుకుంటూ ఉంటారు.. అయితే వీళ్లు ఈ సారి డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నారేమో.. ఏకంగా విమానంలో ప్రయాణిస్తూ గాల్లోనే ఒక్కటయ్యారు ఈ జంట.. విమానంలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!
తమిళనాడు మధురైకు చెందిన రాకేష్, దక్షిణ లా వివాహం కోసం స్పైస్జెట్ చార్టెడ్ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. ఇందులో తమ కుటుంబ సభ్యులు ఏకంగా 161 మంది కలిసి ఈ కరోనా టైం లో వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, డీజీసీఏ అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఎయిర్ పోర్ట్ అధికారులకు సూచించారు.
ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సెంథిల్ వల్వన్ విమానం బుక్ చేసుకున్న సంగతి వాస్తవమే గానీ ఇందులో ప్రయాణానికి మాత్రమే అనుమతి ఇచ్చామని.. అందులో పెళ్లి చేసుకున్న విషయం అసలు తెలియదని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో పెళ్లి చేసుకోవడానికి అనుమతి లేదని, వీరు బంధువులందరూ మాస్కూలు, శానిటైజర్ లు ,భౌతిక దూరం పాటించకుండా ఉన్నందుకు వీరందరి పై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. విమానంలో వీరి పెళ్ళి ఏమిటో గానీ బంధువులు మాత్రం చిక్కుల్లో పడ్డారు.