Dil raju: ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు చిన్న ఇండస్ట్రీ అయిన కన్నడ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. తెలుగులో బాహుబలి సినిమా తర్వాత లెక్కలు మారిపోయి 50 శాతానికి పైగా పాన్ ఇండియన్ సినిమాలను నిర్మిస్తున్నారు. మిగతా 50 శాతం చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఒకరకంగా దీనివల్ల బాక్సాఫీస్ వద్ద మంచి బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఓ పాన్ ఇండియన్ సినిమా పోయినా మంచి కథతో వచ్చే జాతిరత్నాలు వంటి చిన్న సినిమాలు మంచి లాభాలు తీసుకువచ్చి కాస్త ఊరట కలిగిస్తాయి.
అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 తర్వాత మంచి బడ్జెట్తో సినిమాలను నిర్మించేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ ఛాప్టర్ 1కు సీక్వెల్గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాను హోంబలే నిర్మాతలు భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక ఇప్పటికే మరికొన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియన్ రేంజ్లో నిర్మిస్తున్నవే కావడం విశేషం. ఆయన ఒక్కడి మార్కెట్టే దాదాపు 5 నుంచి 7 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ సినిమాకు అందుకునే రెమ్యునరేషన్ కూడా ఊహించని స్థాయిలో ఉంటోంది.
Dil raju: ఇప్పటికే వీరందరితోనూ ప్రాజెక్ట్స్ కమిటయ్యారు.
అయితే ముందుకంటే టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం ఎక్కువైంది. శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు అన్నీ రకాల సినిమాలు నిర్మిస్తూ నంబర్ 1 స్థానంలో నిలిచేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమా, మీడియం బడ్జెట్ సినిమా, చిన్న సినిమా..ఇలా అన్నీ మైత్రీ వారి సంస్థలో రూపొందుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాని, ఎన్.టి.ఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ..ఇలా దాదాపు అందరితోనూ సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వీరందరితోనూ ప్రాజెక్ట్స్ కమిటయ్యారు.
వీరికి ధీటుగా దిల్ రాజు గట్టిగా పోటీపడుతున్నాడు. ఇప్పటికే శంకర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియన్ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఎఫ్ 2 మూవీ సీక్వెల్ సినిమా ఎఫ్ 3 దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. బాలీవుడ్లో జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియన్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే విక్రం కె కుమార్ – నాగ చైతన్యలతో థాంక్యూ సినిమాను పూర్తి చేశాడు దిల్ రాజు. త్వరలో ఇది రిలీజ్ కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నాడు.
Dil raju: వీటికి శిరీష్ సహ నిర్మాతగా కొన్నిటికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అంతేకాదు అల్లు అర్జున్, వేణూ శ్రీ రామ్ కాంబినేషన్లో పాన్ ఇండియన్ సినిమాగా ఐకాన్ నిర్మించబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ – టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో ఓ సినిమా మొదలవబోతోంది. ఇక మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను – కోలీవుడ్ స్టార్ సూర్య కాంబోలో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే రౌడీ బాయ్స్ అనే సినిమా కూడా రూపొందించాడు. ఇలా మొత్తం 10 ప్రాజెక్ట్స్ దిల్ రాజు నిర్మాణంలో నిర్మితం అవుతున్నాయి. వీటికి శిరీష్ సహ నిర్మాతగా కొన్నిటికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.