Dil raju : దిల్ రాజు తన నిర్మాణ సంస్థను బాగా విస్తరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. సౌత్ స్టార్ డైరెక్టర్, క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శిరీష్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. కాగా ఈ సినిమా రాం చరణ్ కెరీర్ లో 15వ సినిమా కావడం విశేషం. అలాగే నిర్మాత దిల్ రాజు బ్యానర్ కు 50వ సినిమా కావడం మరో విశేషం.
అయితే కమల్ హాసన్ తో శంకర్ మొదలు పెట్టిన ‘ఇండియన్ 2’ సినిమా వివాదం కోర్టు దాకా వెళ్లడం వల్ల ఈ సినిమా పూర్తి అయ్యేంత వరకు శంకర్ మరో సినిమాకి డైరెక్షన్ చేయకూడదని కేసు వేయడంతో ‘చరణ్ 15’ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడిందని, ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందో లేదో అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో అందరిలోనూ ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ తాజాగా ‘ఇండియన్ 2’ సినిమా వివాదంలో శంకర్ కు కోర్టు నుంచి ఊరట లభించింది. ఆ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఇది ఎవరు అనుకోలేదు.
Dil raju : దిల్ రాజు చెన్నై వెళ్లి శంకర్ తో చర్చలు జరిపారు.
దాంతో శంకర్ ప్రకటించిన తర్వాత సినిమాలను డైరెక్ట్ చేసుకునే అవకాశం కోర్టు నుంచి లభించింది. ఈ నేపథ్యంలో ‘చరణ్ – శంకర్’ పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లియర్ అయ్యాయి. దాంతో గత ఆదివారం హీరో రామ్ చరణ్ తో పాటు నిర్మాత దిల్ రాజు చెన్నై వెళ్లి శంకర్ తో చర్చలు జరిపారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను అతి త్వరగా మొదలు పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని సమాచారం.