టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు అనిల్ రావిపూడి. కమర్షియల్ ఫార్ములా.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ని తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి దిట్ట. నందమూరి కళ్యాణ్ రామ్ తో తీసిన పటాస్ సినిమా నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు ఇదే ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇదే అనిల్ రావిపూడికి భారీ సక్సస్ లను ఇస్తోంది.
ఇక సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎఫ్ 2 కి సిక్వెల్ ని తీయాలని ప్లాన్ చేసుకున్నాడు ఈ సక్సస్ ఫుల్ డైరెక్టర్. 2019 సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్2’ భారీ కమర్షియల్ హిట్ గా నిలవడంతో పాటు 100 కోట్ల కి పైగానే వసూళ్ళను రాబట్టింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 ని రూపొందించాలని దిల్ రాజు, అనిల్ రావిపూడి అనుకున్నారు. సరిలేరు తర్వాత ఈ సినిమా మొదలవ్వాల్సి ఉండగా కరోనా వల్ల ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది.
ప్రస్తుతం దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2021 సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ రిలీజ్ తర్వాత ఒక భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదే ‘ఎఫ్3’ సినిమా అని సమాచారం. ఎఫ్ 2 కి మించిన ఫన్ ఉండేలా అనిల్ రావిపూడి సిద్దం చేసిన స్క్రిప్ట్ తో భారీ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందించబోతున్నట్టు తాజా సమాచారం.
ప్రస్తుతం వెంకటేష్ ‘నారప్ప’.. వరుణ్ తేజ్ ‘బాక్సర్’ సినిమాలు చేస్తున్నారు. తర్వాత వెంకీ, వరుణ్ కలిసి ఎఫ్ 3 ని నిర్మించబున్నాడట దిల్ రాజు. ఇక దిల్ రాజు ఎఫ్ 3 కి దర్శకుడు అనిల్ రావిపూడి కి.. హీరో వెంకటేష్ కి రెమ్యూనరేషన్ కాకుండా లాభాలలో వాటా ఇవ్వనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని తెలుస్తుంది.