తమిళనాడులోని పెరంబలూర్ లో కొన్ని గుడ్డు ఆకృతిలో ఉన్నటువంటి శిలాజాలు బయటపడడంతో అక్కడి స్థానికులలో తీవ్ర కలకలం రేపాయి. కున్నా జిల్లాలో నీటి ట్యాంకు వద్ద తవ్వకాలు జరుపుతుండడంతో అక్కడ బంతి ఆకారంలో ఉన్నటువంటి కొన్ని శిలాజ అవశేషాలు బయటపడ్డాయి. ఆ వస్తువులు చాలా పురాతన కాలానికి చెందినవని గుర్తించారు. ఈ విషయం బయటపడడంతో ఆ బంతి వంటి ఆకారం ఉన్న శిలాజాలు డైనోసార్ గుడ్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే అవి నిజంగానే డైనోసార్ గుడ్లా? పురావస్తు శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
తవ్వకాల్లో బయటపడ్డ ఈ శిలాజ విశేషాల గురించి సమాచారం తెలుసుకున్న స్థానిక, భూగర్భ పురావస్తు శాఖ నిపుణుల బృందం సంఘటన స్థలానికి చేరుకొని వాటిని పరిశీలించారు. ఒక్క బంతి సైజు దాదాపుగా రెండు వందల కిలోల వరకు బరువు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిని పరిశీలించిన అనంతరం ఇవి డైనోసార్ గుడ్లు కాదని,అమ్మోనైట్ అవక్షేపాల ని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.
ఈ అమోనైట్ శిలాజాలు దాదాపుగా 416 మిలియన్ సంవత్సరాల క్రితం డెవోనియన్ కాలంలో ఏర్పడిన విభిన్న సముద్ర జాతుల సమూహం అని వీరు పేర్కొన్నారు. కొన్ని భారీ సముద్ర జాతులు శిలాజాల రూపంలో మిగిలిపోయిన ఉండటం వల్ల వాటిని డైనోసార్ గుడ్లు గా ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతంఉన్నఅరియలూరు,పెరంబలూర్ సముద్రగర్భంలో ఉండటం వల్ల కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రగర్భంలో శిలాజాలు ఏర్పడటం సహజమేనని,ప్రస్తుతం ఏర్పడిన ఈ అమ్మో నైట్ లు కూడా అలాంటి జాతికి చెందినవేనని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ అమోనైట్ లను డైనోసార్ గుడ్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఇవి కేవలం అపోహ మాత్రమేనని ఇవి డైనోసార్ గుడ్లు కాదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేశారు.