గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్దికి 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్, మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, దర్శకుడు దిలీప్రాజా డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆగస్టు 16న తెనాలి మార్కెట్ సెంటర్లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని దిలీప్ రాజా హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల 27వేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్లో సినిమా పరిశ్రమకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా దారుణమని దిలీప్ రాజా విమర్శించారు. చిన్న సినిమాలను కనీసం వారంలో రెండు రోజులు ప్రదర్శించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని దిలీప్ రాజా కోరారు.
కేవలం అయిదుగురు నిర్మాతల చేతుల్లో సినిమా ధియేటర్లు ఉండటం అన్యాయమనీ, దీనిపై ముఖ్యమంత్రి జగన్ దృష్టిపెట్టాలని దిలీప్ రాజా విజ్ఞప్తి చేశారు.