Gunasekhar: గుణశేఖర్.. Gunasekhar టాలీవుడ్ టాప్ డైరక్టర్స్ లిస్టులో ఉండే దర్శకుడు. వర్మ స్కూల్ నుంచే వచ్చినా తనకంటూ ఓ లైన్ వేసుకుని ముందుకెళ్లిన దర్శకుడు. తనలోని క్రియేటివిటీనీ తొలినాళ్లలోనే ప్రూవ్ చేసుకున్న దర్శకుడు. ప్రశాంత్ తో తొలి సినిమా లాఠీ ఫ్లాపైనా రెండో సినిమా నరేశ్ తో చేసిన సొగసు చూడతరమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అందరూ బాలలతోనే తెరకెక్కించిన రామాయణం ఓ సెన్సేషన్. మామూలుగా రామాయణం తీయాలన్నా.. పిల్లలతోనే మామూలు సినిమా తీయాలన్నా చాలా ఓపిక కష్టం ఉంటుంది. అటువంటిది ఈ రెండింటినీ మిక్స్ చేసి సినిమా తీయడమంటే ఆయనకు సినిమాపై ఎంత ప్యాషనో అర్ధం చేసుకోవచ్చు. నేడు గుణశేఖర్ పుట్టినరోజు.
దర్శకుడిగా 26 ఏళ్ల ప్రస్థానంలో వర్మ ముద్ర లేదు సరికదా గుణశేఖర్ లో క్రియేటివిటీనే ఎక్కువ. 1998లో మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన చూడాలని ఉంది.. భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో గుణశేఖర్ కు క్రేజ్ వచ్చేసింది. అదే ఊపులో మెగాస్టార్ ఇచ్చిన ఆఫర్ కాదనలేక చేసిన మృగరాజు భారీ డిజాస్టర్ అయింది. మధ్యలో చేసిన మనోహరం సినిమా ఆయన ఆలోచనలకు తగ్గట్టే ఉంటుంది. ఇక 2002లో మహేశ్ తో చేసిన ఒక్కడు ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఆపదలో ఉన్న అమ్మాయిని ఓ కుర్రాడు ఎంతవరకైనా వెళ్లి కాపాడే కథ. మహేశ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయింది. సినిమాలో గుణశేఖర్ మార్క్ టేకింగ్ ప్రత్యేకించి కనపడుతుంది.
Read More:Chiranjeevi Oxygen Banks: మీడియా తీరుపై చిరంజీవి నిర్వేదం..! మీడియా అధినేతతో ఫోన్ సంభాషణ..!
అటుపై పలు ఫ్లాపులు.. కొత్త దర్శకులు రాకతో క్రేజ్ తగ్గినా తన ఇంపాక్ట్ పోగొట్టుకోలేదు. ప్రజెంట్ జనరేషన్ తో దర్శకులు టచ్ చేయడానికి ఆలోచించే చారిత్రక కథలను తెరకెక్కిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో ఆయన ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తెరకెక్కించిన రుద్రమదేవి సినిమా గుణశేఖర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కమర్షియల్ గా వర్కౌట్ అయింది.. పలు అవార్డులు కూడా దక్కాయి. ప్రస్తుతం సమంతతో శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత రానాతో హిరణ్యకశిప ఉంది. ఇలాంటి సబ్జెక్టులతో ఆయన ప్రయాణం ఆయనలోని సినిమా అభిరుచికి నిదర్శనంగా చెప్పాలి. రాబోయే ఆయన ప్రాజెక్టులు హట్టవ్వాలని కోరుకుందాం.