ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సినిమాల బడ్జెట్ కూడా తక్కువేం కాదు. కనీసం 200 కోట్ల పైగానే ఉంటుంది. ఇక ఇప్పుడు తెరకెక్కబోయే పాన్ ఇండియన్ సినిమాల బడ్జెట్ అయితే దాదాపు 300 – 500 కోట్ల వరకు కేటాయిస్తున్నారు. కాని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అందుకు కారణం కళ్ళ ముందు సాహో సినిమా అనుభవం కనిపిస్తుండటమే. ఒకే ఒక్క సినిమా చేసిన సుజీత్ కి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అప్పగించాడు ప్రభాస్.
సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాడు సుజీత్. మన తెలుగు సినిమా ఇంత రిచ్ గా తీశారా అన్న ప్రశంసలు దక్కాయి. కాని కమర్షియల్ గా మాత్రం భారీ లాస్ అని తేలిపోయింది. దాంతో నెక్స్ట్ సినిమాల విషయంలో ప్రభాస్ జాగ్రత్త పడతాడని అందరు భావించారు. కాని బడ్జెట్ విషయంలో మాత్రం బ్యాలెన్స్ తప్పుతోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం కంప్లీట్ చేశాడు. గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్ లో నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ఇప్పుడు రాధే శ్యాం బడ్జెట్ ప్రభాస్ ని టెన్షన్ పెడుతుందని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్ అయినట్టు సమాచారం. ఎలాంటి ఇబ్బందులు లేని సమయంలోనే సాహో సినిమాకి పెట్టిన పెట్టు బడులు తిరిగి రాబట్టలేకపోయారు. ఇప్పుడు కరోనా కష్టకాలంలో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో అంత బడ్జెట్ మళ్ళీ వసూలవుతుందా అన్న ఆలోచన మొదలైందట. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాధే శ్యాం తెరకెక్కుతోంది. ఇక ఈ దర్శకుడు కూడా జిల్ అన్న సినిమా ఒక్కటే చేశాడు. మొత్తానికి ప్రభాస్ యంగ్ డైరెక్టర్స్ ని నమ్మి ఎంకరేజ్ చేస్తున్నాడు గాని ఎంతవరకు సక్సస్ అవుతారో అన్నది చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?