“బాహుబలి 2” వంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యం రెండు కూడా అట్టర్ ఫ్లాప్ కావటం తెలిసిందే. దీంతో ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సలార్, ఆది పురుష్, ప్రాజెక్టుకే సినిమాలపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ మూడింటిలో ఒక సినిమా ఆయన హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సలర్ పై పోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది. అయితే పైనున్న మూడింటిలో ముందుగా “ఆది పురుష్” రిలీజ్ కానుంది.
`ఆదిపురుష్` టీమ్ సైలెన్స్కి అదే కారణమా..?
ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ఓం రౌత్ తెలియజేయడం జరిగింది. సరిగ్గా సంక్రాంతి టైములో జనవరి 12వ తారీకు 2023 వ సంవత్సరం అనుకున్న టయానికి “ఆది పురుష్” విడుదల చేస్తున్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ కి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మాట ఇచ్చారు. రామాయణం నేపథ్యంలో తేరకెక్కుతున్న “ఆది పురుష్” లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తున్నారు. సీతాదేవి పాత్రలో క్రుతి సన్నన్ నటిస్తోంది. ఇంకా వెళ్ళాను రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. త్రీడీ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కానుంది.
ఫస్ట్ టైం 3d పిక్చర్ లో ప్రభాస్ నటిస్తుండటంతో “ఆది పురుష్” కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ నెలలో ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో “ఆదిపురుష్” ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంత మాత్రమే కాదు ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టు “బాహుబలి” లో కంటే పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ “ఆదిపురుష్”లో చూడచ్చు. తెలుగు, హిందీ భాషల్లో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.