A – ఆదిపురుష్ సినిమా గురించి ఇప్పుడు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా కి సంబంధించి మేకర్స్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగ లా ఉంటోంది. బాహుబలి తర్వాత prabhas రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప్రభాస్ సినిమా చేయాలంటే కథ .. బడ్జెట్ .. దర్శకుడు .. అందరు పాన్ ఇండియన్ రేంజ్ వాళ్ళే కావాల్సి వస్తోంది.
ఒక్కో సినిమా బడ్జెట్ కూడా కనీసం 300 కోట్లు కేటాయించాల్సిందే. అంతగా prabhas తన మార్కెట్ ని పెంచుకున్నాడు. ఇక సాహో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆ సినిమా తర్వాత ప్రభాస్ ని బాలీవుడ్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ లో చేయమని అక్కడి మేకర్స్ పట్టుపడుతున్నారు. కాని prabhas ఏది పడితే అది చేసేందుకు ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పుకొని ఉంటే ఈ పాటికే ధూం సిరీస్ లో 4 పార్ట్ ఇప్పుడు సెట్స్ మీద ఉండాల్సింది.
కాగా prabhas ఫస్ట్ బాలీవుడ్ సినిమాగా ఆదిపురుష్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా కేవలం ప్రభాస్ కోసమే చేస్తున్నట్టు వెల్లడించాడు దర్శకుడు ఓం రౌత్. ఒకవేళ prabhas గనక ఆదిపురుష్ సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదంటు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఓం రౌత్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఇటీవలే రాధే శ్యాం కంప్లీట్ చేసిన prabhas సంక్రాంతి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించేందుకు సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాడు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుండగా కేవలం 4 నెలల్లో సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేయాలని పక్కా ప్లాన్ చేసినట్టు సమాచారం.