ఆంధ్రప్రదేశ్ లో లంచగొండుల పని పట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దిశ తరహాలోనే లంచగొండుల భరతం పట్టడానికి బిల్లును రూపొందించింది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి సమీక్షా సమావేశం నిర్వహించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే నిర్దిష్ట సమయంలోనే చర్యలు తీసుకోనేలా ఏర్పాట్లు చేసారు.
1902 నెంబర్కు వచ్చే అవినీతి సంబంధిత కేసులు అన్నీ ఇకపై 14400 నెంబర్ కు బదలాయించనున్నారు. ఇది ఏసీబీకు చెందిన టోల్ ఫ్రీ నెంబర్. అలాగే ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్ విలువ రూ. కోటి దాటితే కచ్చితంగా రివర్స్ టెండరింగ్ కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా అనుసంధానం చేయనున్నారు. ముఖ్యంగా ఎమ్మార్వో, ఎండీఓ, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.