TV9 Telugu: టీవీ9 లో ముగ్గురు మహిళా యాంకర్లు సిగపట్లకు దిగడం,ఈ క్రమంలో ముగ్గురూ ఉద్యోగాలు కోల్పోవడం ప్రస్తుతం మీడియా రంగంలో సంచలనం రేపుతున్న సబ్జెక్ట్.ఎప్పుడైతే టీవీ9 యాజమాన్యం మారిపోయిందో అప్పటి నుండే ఆ సంస్థలో అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.అయితే ఇప్పటివరకు అవి నాలుగు గోడల మధ్య ఉంటూ వచ్చాయి.కానీ తాజాగా ఈ గొడవలు తారాస్థాయికి చేరుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి.కేసు సైతం నమోదైన పరిస్థితి ఏర్పడింది.దీంతో టీవీ9 యాజమాన్యం తల పట్టుకుంటోంది.గొడవలకు కారకులైన మహిళా యాంకర్లని ఇంటికి పంపించేసింది.డేటా చౌర్యం వ్యవహారం సంస్థకు చుట్టుకోవడంతో యాజమాన్యం.
అసలేం జరిగిందంటే!
ఆ ప్రముఖ న్యూస్ చానల్లో పనిచేసే కొందరు మహిళా యాంకర్ల మధ్య మనస్పర్థలు ఉన్నాయి.ఈ నేపధ్యంలో ఒక మహిళా యాంకర్ ఉద్యోగం ఊడిపోయింది.దీంతో ఆ యాంకర్ ఇద్దరు మహిళా యాంకర్ల ని టార్గెట్ చేసింది.వారిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.అతి కీలకమైన, వ్యక్తిగతమైన రహస్యమైన సమాచారం ఉన్న తన ఫోన్ ని ఆ ఇద్దరు మహిళా యాంకర్లు లాక్కుని అందులోను డేటాను చోరీ చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మొత్తం నలుగురిపై కేసు!
అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ముందు ఈ విషయాన్ని తమ సంస్థలోని మరో సీనియర్ యాంకర్ కు, హెచ్ఆర్ మేనేజర్ కు తెలియజేసినా వారు పట్టించుకోక పోగా ఆ ఇద్దరు మహిళా యాంకర్లనే సమర్థించారని ఆమె వాపోయింది.మహిళా యాంకర్లతో పాటు ఆ సీనియర్ యాంకర్,హెచ్ ఆర్ మేనేజర్ పేర్లను కూడా తన ఫిర్యాదులో ఆమె పేర్కొనడంతో నలుగురి పైనా కేసు నమోదైంది.నమోదైన కేసు తీవ్రత అధికంగా ఉండటంతో టీవీ 9 యాజమాన్యం ముందుగా ఇద్దరు మహిళా యాంకర్లను ఉద్యోగాల నుండి తొలగించినట్లు సమాచారం.సినీ రినాకర్ను హెచ్ఆర్మేనేజర్లు ఏం చేయాలన్న విషయంలో యాజమాన్యం తర్జనభర్జన పడుతున్నట్లు బోగట్టా.డేటా చౌర్యం వ్యవహారం సంస్థకు చుట్టుకోవడంతో యాజమాన్యం లోలోన ఆందోళన చెందుతున్నప్పటికీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని మీడియా వర్గాలు చెప్తున్నాయి.