దివ్యాంగ విద్యార్థుల చదువుకు చేయూత ఇచ్చేందుకు (ఏఐసీటీఈ) సాక్షమ్ స్కాలర్షిప్లను అందిస్తోంది.. !వారిని ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో డిప్లొమా, ఇంజినీరింగ్ కోర్సులు చదువుతోన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.. ! అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం రూ. 50 వేలు అందిస్తుంది..!
కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ). దివ్యాంగులు సాంకేతిక విద్యలో రాణించి, సొంత కాలిపై నిలబడేలా చేయడానికే ఈ స్కాలర్షిప్లు. వీటిని డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ వారికి నాలుగేళ్లపాటు ఇస్తారు. అయితే లేటరల్ ఎంట్రీ విధానంలో డిప్లొమా, ఇంజినీరింగ్లో చేరిన వారికి డిప్లొమాలో రెండేళ్లు, ఇంజినీరింగ్లో మూడేళ్ల పాటు ఈ స్కాలర్షిప్ను అందిస్తారు. పుస్తకాలు, ఫీజు, వసతి, కంప్యూటర్, ఇతర ఖర్చుల నిమిత్తం వాడుకోవచ్చు.
అర్హతలు :
2020-2021 విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్లో చేరి ఉండాలి. లేటరల్ ఎంట్రీ విధానంలో రెండొవ సంవత్సరం చదివే వారు అర్హతలు. ఇందుకోసం బ్యాంకు అకౌంటు, ఆధార్ కార్డు తప్పనిసరి. ఇన్కమ్ సర్టిఫికెట్ పత్రాన్ని జతచేయాలి. వైకల్యం కనీసం 40% మించి ఉండాలి. ఇంతకముందు ఏ స్కాలర్షిప్లనూ పొందనివారై ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో కోర్సులు చదివుండడం తప్పనిసరి. నేషనల్ స్కాలర్షిప్ ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్: https://scholarships.gov.in/
చివరి తేదీ : 30/12/2020.