Temple: అమ్మవారి గుడుల్లో, నవరాత్రి పూజా సమయంలో పసుపుతో చేసే అలంకారాలు విశేషమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి వెళ్లినప్పుడు పసుపు ప్రసాదాన్నిఇస్తుంటారు. అలా ఇచ్చిన పసుపును మీరు ఏం చేస్తారు?
ప్రసాదంగా పసుపును తీసుకున్నప్పుడు ఇంటికి తీసుకు వచ్చి ఏమి చేయాలో తెలుసుకుందాం.
1. దేవుని ప్రసాదం గా లభించిన పసుపును పూజాస్థానంలో పెట్టి ప్రతి రోజు పూజిస్తే అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి జరుగుతుంది.
2. పసుపును కాస్త నీటిలో వేసుకుని స్నానం చేస్తే దేహ కాంతి పెరగడం తో పాటు సమస్త చర్మరోగాలు తగ్గిపోతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని అంటారు.
3. కాస్త పసుపు తీసుకుని గౌరీదేవిని చేసి పూజించటం వలన ఇంట్లో ఉండే పెళ్లికాని ఆడపిల్లలకు వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం జరుగుతుంది.
4.అమ్మవారికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషాలు, తెలియక చేసిన దైవ దోషాలు తొలగిపోతాయి.
5. వ్యాపార స్థలం లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా ఆ పసుపు పొడిని వేయడం వలన వెంటనే అవి అమ్ముడై పోతాయి.
9. గృహదేవతను ఆ పసుపు నీటితో కడగడం వలన విగ్రహాలకు దైవ కళ మరింత పెరుగుతుంది.
10. ప్రసాదంగా కుంకుమ లేదా విభూతి ఇస్తే చాలామంది వాటిని మంచెం నుదుటన పెట్టుకుని మిగిలిన దాన్ని ఆలయ గోడలపై లేదా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు అని పెద్దలు తెలియచేస్తున్నారు. గుడిలో స్వామి వార్లను , అమ్మవార్లను విభూతి, కుంకుమలతో పూజించి ఆ తర్వాత వాటిని మనకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలా విభూతి, కుంకుమ ప్రసాదాలు ఇవ్వడం అనేది మనతో పాటు మన చుట్టూ ఉండే వారిని రక్షించటం అనేది ముఖ్య ఉద్దేశ్యం.
అలాంటి శక్తి వంతమైన ప్రసాదాలను ఆలయాల్లోనే వదిలి వెళ్ళడం,నిర్లక్ష్యం చేయడం అనేది దైవ అనుగ్రహాన్ని కాదనుకోవడం తో సమానమవుతుంది. కాబట్టి కుంకుమ, విభూతి వంటి వాటిని కొద్దిగా నుదుట ధరించి, మిగిలిన దాన్ని ఇంటికి తెచ్చుకుని, మన పూజా మందిరంలో నిల్వ చేసుకుని , ప్రతిరోజూ నుదుటన ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు తెలియ చేస్తున్నాయి. వాటిని మన ఇంటి చుట్టుప్రక్కల వారికి కూడా అందిస్తే ఇంకా మంచిది.