Shivalayam: తీర్ధము తీసుకునేటప్పుడు ౩సార్లు కూడా విడివిడిగా ఒకదాని తర్వాత మరొకటి గా తీసుకోవాలి. వెంటవెంటనే మూడుసార్లు తీర్ధం ఒకే సారి తీసుకొనరాదు. దేవునిపూజ చేయడానికి ఉపయోగించే ఆసనం పూజ కు మాత్రమే వాడాలి తప్ప వేరే వాటికీ వాడకూడదు. మగవారు దేవునికి సాష్టాన్గానమస్కారం తప్పక చేయాలి. ఆడవారు మాత్రం అస్సలు చేయకూడదు. స్త్రీలు కేవలం మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు తాకించి మాత్రమే నమస్కారం చేసుకోవాలి .యుద్దము కోసం శంఖమును పూరించుచున్న కృష్ణుడు లేదా ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో, విగ్రహం లాంటివి ఇంట్లో ఉంచుకోకూడదు. ధ్యానం చేస్తున్న ఈశ్వరుడు,హనుమంతుడు ( Hanuman ) కూడా ఉండకూడదు. లక్ష్మీఅమ్మవారు స్థిరం గా కూర్చునిఉన్న ఫోటో లేదా విగ్రహంగాని పెట్టుకోవచ్చు కానీ అమ్మవారు నిలబడి ఉన్నది మాత్రం ఉపయోగించకూడదు.
Shivalayam: శివాలయానికి వెళ్ళినప్పుడు
శివాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో నడవకండి. ఉదయం పూట ,సాయంకాల సమయం ఈ రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.దీనిఫలిత దానిదే.
తులసి దళములతో పూజ చేసేటప్పుడు దళ ములుగానే వాడాలి తప్ప,ఆకులుగాతెంపి వేయడం దోషము అని గమనించాలి. అలా తుంచడం వలన మరు జన్మలో భార్యా వియోగము కలుగుతుంది. ఏ పువ్వులు అయినాకూడా రేకులు తెంపి పూజిస్తే భార్యాభర్తలకు వియోగము తప్పదు.
ఏ గుడికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి. శివాలయమునకు వెళ్ళినపుడు ముందుగా నవగ్రహాల దర్శనం చేసుకుని , ప్రదక్షిణాలుఅయినతర్వాత , కాళ్ళు కడుగుకొని ఆ తరువాత శివయ్య దర్శనం చేసుకోవాలి.అదే విష్ణు రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వా