Peaceful: Early Morning మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు. ఆర్ధికం గామానసికం గా శారీరకం గా ఇలా అనేక సమస్యలు ఎదురుకుంటూ ఉంటాడు.అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడడం తో పాటు మంచి జరిగి ప్రశాంతత Peaceful కలుగుతుంది.అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందా…ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని తడుముకోకుండా చెప్పేయవచ్చు.కానీ అస్సలు పొద్దున్న నిద్రలేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి.
ఇలా చేయడం వలన జీవితం లో అదృష్టం వెన్నంటే ఉంటుంది.అలాగే నిద్ర పోయేముందు ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించి ఇంకా ఎవ్వరితో మాట్లాడకుండా నిద్రపోవాలి.అలాగే తెల్లారే మెలుకువ వస్తుండగానే హరి,హరి అంటూ 11 సార్లు జపిస్తూ మేలుకోవాలి. అరచేతులు చూసుకోవాలి.లేచాక ఇష్ట దైవన్నీ చూడవచ్చు లేదా ఎవ్వరి ముఖాన్ని వారు అద్దం లో చూసుకోవచ్చు.మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి, వేరే దిక్కు లేక తల్లి లాంటి నీ మీద కాళ్ళతో నడుస్తున్న కాపాడుతల్లి అని భూమాతని కోరుకోవాలి.
ఆ తర్వాత ఉత్తర దిక్కుగా 4 అడుగులు వేసి వెనక పక్కన ఉండే తలుపులు ముందు గా తెరవాలి.తర్వాత మెయిన్ డోర్ తెరవాలి.ఆ తరువాత వీలును బట్టి వేప చెట్టు,రావి చెట్టు,గో శాల ,దేవుళ్ళ ఫోటోలు,వంటి పవిత్ర వస్తువులు చూడాలి.స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి, పురుషులు సూర్యునికి నమస్కరించాలి.పళ్ళు తోముకునే టప్పుడు , తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోమ కూడదు. అలాగే ఇంటిలో ఆడవారు ఎలాంటి పరిస్థితులలో కూడా రాత్రే గిన్నెలు తోముకుని,పొయ్య శుభ్రం చేసుకుని,చెత్త అంతా బయట పడేసి వంట గది శుభ్రం చేసిపెట్టుకోవాలి.
పొద్దున్న లేవగానే పళ్ళు తోముకుని ..ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజ చేస్తే టైం సరి పోదు అనుకున్నవారు దేవుడికి నమస్కరించి పొయ్య వెలిగించి వంట మొదలు పెట్టాలి. వంట చేసేటప్పుడు మీకు ఇష్టం అయితే భక్తి పాటలు, స్తోత్రాలు పెట్టుకుని వంటచేయండి. అది మీ ఇంటిలో వారందరికి మనఃశాంతి ని అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు అలా చేసిన వంట తిన్న పిల్లకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు .