Food: కోపంతో విసిరి కొడతారో
పిల్లలు తెలిసో తెలియకో ఏదైనా తప్పుచేస్తే వాళ్లు భోజనం చేసేటైం లో దొరుకుతారు కాబట్టి అప్పుడే తల్లిదండ్రులు వారిని మందలించడం అనేది జరుగుతుంటుంది. ఆ మాటలను భరిస్తూ బాధపడుతూనే వాళ్లు భోజనంముగిస్తారు. ఇలా బాధ పడుతూ చేసిన భోజనం వారికీ ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది అని పండితులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది ఆవేశాన్ని అదుపు చేసుకోలేక అన్నం కంచాన్నివిసిరేస్తుంటారు. జీవితంలో ఎవరైతే అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తారో… కోపంతో విసిరి కొడతారో అది వారికి అందకుండా పోతుంది అని ఆధ్యాత్మిక నిపుణులు తెలియచేస్తున్నారు. మరీ ముఖ్యంగా నేటి యువతి, యువకులు అన్నం తినాలంటే చాల అయిష్ట చూపుతుంటారు.
Food: అన్నము పై విసుగు
ఇది ఇంకా ప్రమాదకరం గా మారుతుందట. అన్నం అంటే సాక్ష్యాత్తు అన్నపూర్ణ దేవి గా భావిస్తారు. అలాంటి అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తే.. ఎదురుగా అన్నం ఉండి కూడా తినలేని పరిస్థితి కలగవచ్చు. మనకు ఆరోగ్యం బాగాలేన్నపుడు అన్నం ఉన్నప్పటికీ మనం తినలేకపోవడం వంటి పరిస్థితి రావొచ్చు. ఎదురుగా అన్నంఉంటుంది ,కడుపులో ఆకలి కూడా ఉంటుంది.. కానీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితిలో అన్నము పై విసుగు, నిర్లక్ష్యంప్రదర్శించవద్దు. అన్నం అన్న పూర్ణ దేవి.. మన ప్రాణాలు నిలబెట్టే ప్రత్యక్ష దేవత గా భావించాలి.
కోపం తో గొడవలు పడి ఇంట్లో అందరూ భోజనం మీద అలిగి కటిక ఉపవాసం చేయడం చాలా దోషమని పెద్దలుతెలియచేస్తున్నారు. భోజనం తింటున్నవారి పై ఆవేశ పడడం వలన శాస్త్ర సంబంధమైన దోషాలు, అనారోగ్య సమస్యలు కూడా చుట్టూ ముడతాయి. అందుకే భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకూ కోపాలు ,గొడవలకు దూరం గా ఉండడమే అన్నివిధాలా మంచిది.
శుచిగా స్నానం చేసి ప్రసన్నమైన మనస్సు తో
భోజనం అనేది పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా చేసినప్పుడే వంటబడుతుంది అంటారు పెద్దలు. అందుకే హడావిడిపడకుండా ,మాట్లాడకుండా,టీవీ ,ఫోన్ లకు దూరం గా ఉండి భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు. దానికి తోడు వంట చేసేవారు కూడా శుచిగా స్నానం చేసి ప్రసన్నమైన మనస్సు తో వంట చేస్తే అది తిన్నవారికి ప్రశాంతత వంటబట్టి మంచి మనస్సు తో ఉంటారు.