Bad Habits: ఆరోగ్యకర జీవనశైలి ద్వారా మనల్ని మనమే కాపాడుకోవాల్సిన సమయం ఇది .కాబట్టి మీకు ఆహారం విషయం లో ఈ కింద చెప్పిన చెడు అలవాట్లు ఉంటే వెంటనే వదిలించుకోండి.
ఆహారం తీసుకునే విషయంలో మీకు ఈ చెడు అలవాట్లు ఉన్నాయా ?
కొంత మంది తినడం మొదలు పెడితే ఏమి తింటున్నాం?ఎంత తింటున్నాం ?అన్న ద్యాస లేకుండా అదే పనిగా తినేస్తుంటారు. ఆహారం విషయం లో ఏమి తినాలి .. ఎంత తినాలి .. ఎప్పుడు తినాలి అనేదాని మీద మీకు ఒక క్లారిటీ అనేది కచ్చితం గా ఉండాలి. ముఖ్యం గా బరువు తగ్గాలనుకునేవారు అర్థరాత్రి ఆహారం తీసుకోకూడదని నిపుణులు చేసిన పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఎందుకంటే అర్థారాత్రి తినే ఆహారం తో బరువు బాగా పెరిగే అవకాశం ఉంటుంది అని గుర్తు పెట్టుకోవాలి.
ఎప్పుడు ఎదో ఒకటి తింటూనే ఉండడం అనేది పిల్లల్లోనే కాదు.. పెద్దల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. సాల్టీ చిప్స్ తినడం , కూల్ డ్రింకులు తాగడం, స్వీట్స్ , జంక్ ఫుడ్ ఇలా ఏదో ఒకటి తినడానికి ఉండవలిసిందే. కానీ ఈ అలవాటు వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని గమనించాలి. పొద్దున్నే తినే అల్పాహారాన్ని చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. నిజానికి అది అది చాలా చెడ్డ అలవాటు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రోజు మొత్తం లో అతి ముఖ్యమైది బ్రేక్ ఫాస్ట్. మనం ఉదయం తినే ఆహారమే మనం రోజంతా చురుకుగా ఉంచుతుంది . బ్రేక్ ఫాస్ట్ మానేసి , మధ్యాహ్న భోజనం ఎక్కువ తిన్న ఫలితం ఏమి ఉండదు.
తాము ఎక్కడ చిన్న గొడవ పడినా కొంతమంది ఎమోషనల్ అవుతుంటారు. ఆ బాధలో కనిపించిందల్లా తినేస్తూ ఉంటారు. భావోద్వేగాల వల్ల కూడా తినాల్సిన దాని కన్నా ఎక్కువ తినే అవకాశం ఉందని అధ్యయనాలు సైతం తెలియచేస్తున్నాయి. భోజనం అనేది చాలా ప్రశాంతంగా నెమ్మదిగా బాగా నమిలి తినాలి. కానీ చాలామంది కంగారుగా ,త్వరగా తినేస్తుంటారు. అస్సలు భోజనం తినడానికి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు సమయాన్ని పెట్టుకోవాలి. వేగంగా తినడం వలన ఎక్కువ ఆహారం తినడం అనేది జరిగి బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.కాబట్టి ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మార్చుకోవడం మంచిది.
టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఓ రేంజ్లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…
లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు…
టాప్ 10 తెలుగు ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…
పోయిన శుక్రవారం భారీ అంచనాల నడుమ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటే `బింబిసార`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…
విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…
ఒకప్పటి హీరోయిన్ లయ స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ 2000 కాలంలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కెరీర్ పీక్…