Petrol : చమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా భగ్గుమంటుంటే అక్కడ మాత్రం లీటర్ పెట్రోల్ రూ.1.50కే దొరుకుతుంది. ఇదంతా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రచారం అనుకుంటే మీ తప్పిదమే అవుతుంది. కానీ ఇది ఇండియా మాత్రం కాదు.
Petrol price: కేంద్రం ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ అందిస్తుందట..! ఆ కేంద్ర మంత్రి ఉవాచ..!!
మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న చమురు ధరలకు తోడు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. చాలీచాలని జీతంతో నెట్టకొస్తున్న సామాన్యులు ఇంధన ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.85 నుంచి ఏకంగా లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.112కు పెరిగింది. ఇక డీజిల్ ధర కూడా రూ.65 నుంచి ఏకంగా సెంచరీ మార్క్ దాటేసి 110 దిశగా దూసుకుపోతున్నది. దీంతో వాహనాలు బయటకు తీయాలంటేనే జనాలు భయపడుతున్నారు. అలాంటిది లీటర్ పెట్రోల్రూ.1.50 దొరుకుతుందని చెప్పినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం…
Free Petrol & Diesel: ఉచితంగా 50 లీటర్ల డీజిల్, పెట్రోల్ పొందండిలా..!!
వెనిజులా దేశంలో చమురు నిల్వలు పుష్కలం..
దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశంలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కంట్రీ అమెరికా చమురును సరఫరా చేస్తూ దాని అవసరాలను తీరుస్తోంది. ప్రస్తుతం ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్నా ఆ దేశ పౌరులకు లీటర్ పెట్రోల్ 0.02 డాలర్లు అనగా మన కరెన్సీలో రూ.1.50కే విక్రయిస్తోంది. చమురు నిల్వలు అధికంగా ఉండటం వల్లే అతి తక్కువ ధరకు పెట్రోల్ అందిస్తోంది.
Petrol: పెట్రోల్ & డీజిల్ ధరలు… మన బీపీ మరింత పెంచేలా కేంద్రం ఇంకో నిర్ణయం
వెనిజులా బాటలోనే ఇరాన్..
వెనిజులా బాటలోనే ఇరాన్ కూడా తమ దేశ పౌరులకు లీటర్ పెట్రోల్ 0.06 డాలర్లు అనగా మన కరెన్సీలో రూ. 4.51కే అందిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ అంతర్యుద్ధంతో నలుగుతున్నా తమ పౌరులకు అతి తక్కుత ధరకే పెట్రోల్ అందిస్తూ వార్తల్లో నిలిచింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ రూ.192 ఎక్కడ అమ్ముతున్నారంటే చైనాలోని హాంకాంగ్ నగరంలో.. కారణం చైనా చమురు నిల్వలను అధికంగా వినియోగించడమే..