బహమాస్ దేశం దీవుల సమూహం. ఇక్కడ పందులు ఈత కొడుతుంటాయి. పారడైజ్ లాస్ట్ – బహామాస్ లోని పిగ్ బీచ్. ఈ పిగ్ ద్వీపానికి అధికారికంగా బిగ్ మేజర్ కే అని పేరు. ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడ ఐలాండ్స్ ను సందర్శించేందుకు వస్తుంటారు. ఆ దేశ జీడీపీలో సగభాగం పర్యాటక రంగానిదేనని అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అందమైన ఐలాండ్స్, ఆకట్టుకునే ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటకులను బాగా ఆకర్షిస్తున్నాయి.
బహామాస్ లోని ఎక్సుమా జిల్లాలో ఉన్న 360 కి పైగా ద్వీపాలలో ఇది ఒకటి. ఈ ఈత పందులను చూసేందుకు ఇది ఒక ప్రత్యేకమైన గమ్యస్థానంగా మారింది.మెరిసే తెలివైన-నీలం మహాసముద్రం, 20 లేదా అంతకంటే ఎక్కువ స్నేహపూర్వక పందులతో ఈ బీచ్, మేఘాలు లేని ఆకాశం గురించి ఆలోచించండి. స్వర్గంలా అనిపిస్తుందా? ఈ విషయాలు నిజమే మరి.
అసలు ఈ ఐలాండ్ కు పందులు ఎలా వచ్చాయో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనికి రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కొంత మంది అభిప్రాయం ప్రకారం నావికులు తిరిగివచ్చే ప్రయాణంలో ఆహారం కోసం అవసరమైతే వీటిని తీసుకొని వచ్చి వదిలేశారని అంటున్నారు కొంత మంది. మరికొందరు ఈ దీవి సమీపంలో ఏదైనా ఓడ ప్రమాదానికి గురై ఉంటుందని, ఆ ఓడ లో ఉన్న పందులే ఇక్కడికి చేరి ఉంటాయని చెబుతున్నారు. అయితే పందులు ఎలా వచ్చాయి అనే దానికన్నా వాటి వల్ల పర్యాటకుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని అక్కడి ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తుంది.
ఈ ద్వీపంలో పందులు తినడానికి సహజమైన వృక్ష సంపద లేదు. అందువల్ల పర్యాటకులు ద్వీపానికి తీసుకువచ్చిన ఆహారంపై ఆధారపడటం ప్రారంభించాయి. అయితే ఈ బీచ్ లో ప్రస్తుతం 20కిపైగా పందులు ఎంతో లగ్జరీగా బ్రతికేస్తున్నాయి. సముద్రంలో ఈత కొడుతూ జల్సా చేస్తున్నాయి. వీటిని చూసి పర్యాటకులు ఆనందిస్తున్నారు.