kashmir of Andhra Pradesh: కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
కాశ్మీర్ ని తలపించే లాంటి ప్రదేశం మన ఆంధ్ర లో కూడా ఒకటి ఉంది అంటే ఆశ్చర్యపోతున్నారా?నిజం గా ఇలాంటి ప్రదేశం ఒకటుంది. అలా ఉంటుంది కాబట్టే దీన్ని ముద్దుగా కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లేదా ఆంధ్రా ఊటీ అన అంటుంటారు. అరకులోయ అనగానే వెంటనే మన కళ్ళముందు మన్యం అందాలు మెదులుతూ ఉంటాయి. కేవలం అరకు లో మాత్రమే కాదు లంబసింగి, కొత్తపల్లి,చింతపల్లి, ప్రాంతంలో కూడా ఎన్నో అందమైన ప్రదేశాలు మనకు కనువిందు చేస్తాయి.
kashmir of Andhra Pradesh: సరిగ్గా 3500 అడుగుల ఎత్తులో
లంబసింగి ఘాట్రోడ్లో అయితే మనకు కాఫీ తోటలు ఎక్కువగా కనిపిస్తాయి. లంబసింగి కి చేరుకునే ముందే మనకు బోడ కొండమ్మ గుడి దర్శనమిస్తుంది. ఈ గుడి కి అరకిలోమీటరు కిందకి వస్తే ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు నీరు పడుతూ కనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి లంబసింగి (lambasingi) గ్రామం చాలా దగ్గర. విశాఖ జిల్లాలోని సముద్ర మట్టానికి సరిగ్గా 3500 అడుగుల ఎత్తులో లంబ సింగి ఉంది. చింతపల్లి వెళ్లే దారిలో నర్సీపట్నం కి 60 కి.మీ. దూరంలో ఉంది. ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక్కసారిగా వాతావరణం సున్నా డిగ్రీల వరకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత పొందింది. ఇక్కడ ఇలాంటి ఉష్ణోగ్రత ఉండడం వలన ఆంధ్రా కాశ్మీర్, ఆంధ్రా ఊటీ అని అంటుంటారు . చలి కాలం లో జీరో డిగ్రీలు ఒక్కొక్కసారి అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత కూడా ఉంటుంది. మిగిలిన సీజన్లలో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉంటాయి.
ఏకంగా బెంగళూరు
ఎంతో దూరం నుంచి కూడా ప్రకృతి ప్రేమికులు లంబసింగి కి చేసురుకుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చే పర్యాటకులు దట్టంగా కురుస్తున్న పొగమంచులో ఉల్లాసంగా ఆహ్లాదంగా తమ సమయాన్ని గడుపుతారు. పర్యాటకులు కొందరు కట్టెలు, కిరోసిన్ వెంట తెచ్చుకొని చలి మంటలు వేసుకుంటారు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో లంబసింగి కి పయనం అవుతున్నారు అంటే ఈ ప్రదేశానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. మన్యం ప్రాంతం అవడం వలన కొండలు, అడవులు నుండి ప్రయాణం సాగుతుంది. ఇరువైపులా లోయలు తో ఉండి మధ్యలో రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దక్షిణ భారత దేశం అంతా ఎక్కడా లేనివిధంగా శీతాకాలంలో లంబసింగిలో మంచు వర్షం పడుతుంది. ఈ ప్రదేశం చూడాలనుకున్న వారు ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.