మెగా ఫ్యామిలీలో హీరోయిన్ గా పరిచయం అయిన ఒకే ఒక్క ముద్దుగుమ్మ నిహారిక. ఇప్పడు ఈ ముద్దుగుమ్మ విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే నిహారిక పెళ్లి కరారు అయిన సంగతి తెలిసిందే. దాంతో మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొందని తెలుపొచ్చు. మెగా నాగబాబు కూతురైన నిహారిక పెళ్లి డిసెంబర్ 9 రాత్రి రాజస్థాన్ లో జరగనుంది. దీనికోసం నాగబాబు ఫ్యామిలీ ఇప్పటికే ఏర్పాట్లను చేస్తోంది.
కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఈ పెళ్లి కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యనే జరిగేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఏర్పాట్లల్లో అయ్యే ఖర్చుకు మెగా ఫ్యామిలీ ఎక్కడా వెనకాడటం లేదని సమాచారం. నిహారిక పెళ్లిని ఒక మధుర జ్ఞాపకంగా మిగిల్చేందుకు మెగా ఫ్యామిలీ ప్రయత్నం చేస్తోంది. అందుకే కాబోయే అల్లుడికి ఎక్కడా తక్కువ చేయకుండా చూస్తున్నారని సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ మొదలైంది.
సోషల్ మీడియాలో వస్తున్న విషయాల ప్రకారం మెగా నాగబాబు తన అల్లుడికి రూ.10కోట్ల వరకు పలు లాంఛనాలను ఇస్తున్నారని తెలుస్తోంది. అలాగే ముద్దుల కూతురు నిహారిక పేరు మీద ఉన్న ఆర్థిని కూడా అల్లుడికే ఇస్తున్నారని సమాచారం. ఇంకో విషయం ఆసియా ఖండంలో ది బెస్ట్ హోటల్ గా పేరున్న ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో నిహారిక పెళ్లి చేయబోతున్నారు. అయితే ఇప్పటికే పలు ఫొటో షూట్లల్లో నిహారిక పాలుగొంటున్న విషయం తెలిసిందే.
అయితే పెళ్లి దగ్గర పడుతుండటంతో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం నిహారిక-చైతన్య ఉదయ్ విలాస్ ప్యాలెస్ కు చేరుకున్నట్లు సమాచారం.ఈ ప్యాలెస్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖేష్ అంబానీ కూతురు ఈశా సంగీత్ వేడుక కూడా ఇక్కడే జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే సెలబ్రెటీల పెళ్లి విషయాలు వచ్చినప్పుడు ఇలాంటి చర్చలు జరగడం సాధారణం. వీటిపై ఆ కుటుంబ సభ్యులు మాట్లాడితే గానీ మనం ఏది నిజం, ఏది అబద్దం అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఇవి అంతా గాసిప్స్ మాత్రమే.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!