Rice: అన్నం వండాలి అని అనుకున్నప్పుడు బియ్యాన్ని కడిగి నీళ్లు పారబోసేస్తూ ఉంటాము. అయితే ఈ బియ్యం నీటి లో ఉండే పోషకాల వల్ల కలిగే ప్రయోజనాల తో పాటు ఈ బియ్యం నీళ్లతో ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు అనేది తెలుసుకుందాం.. బియ్యం కడిగిన నీళ్లలో ఉండే పోషకాలు చర్మానికి, వెంట్రుకలకు చక్కని పోషణ అందిస్తాయి . బియ్యం కడిగిన నీటి కోసం బియ్యం బాగా కడిగిన తర్వాత ఆ బియ్యం లో కప్పు లేదా రెండు కప్పుల నీళ్లు పోసి ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి.
ఆ తర్వాత బియ్యం బాగా నొక్కి కడిగి ఆ నీటిని పడగొట్టిన తర్వాత వచ్చిన బియ్యం నీరు జుట్టుకు పట్టిస్తే, జుట్టు మెరుస్తూ ఉండడం తో పాటు కుదుళ్లు కూడా బలం గా తయారవుతాయి. అదే నీటిని ముఖానికి పట్టిస్తే మొటిమల వలన ఎర్రబడిన చర్మం మామూలుగా మారుతుంది. చర్మ మీద తెరుచుకుని ఉన్న రంధ్రాలు మూసుకుని, చర్మం బిగుతుగా తయారవుతుంది. బియ్యం నీటిలో ఉండే పోషకాల వల్ల చర్మం జీవం సంతరించుకోవడం తో పాటు చర్మం నునుపుగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. చర్మం మీద మంట,దద్దుర్లు,
వంటి చర్మ సమస్యలు ఉన్న నెమ్మదిగా తగ్గిపోతాయి. ఎండ దెబ్బకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి మామూలుగా మారుతుంది. బియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టాక… వేరు చేసిన నీటిని ఫ్రిజ్లోని ఐస్ క్యూబ్ ట్రేలలో పోసి ఆ నీరు గడ్డకట్టి ఐస్ క్యూబ్స్ గా తయారవుతాయి. వాటిని తీసుకుని స్నానానికి వెళ్ళే 10 నిమిషాల ముందు చర్మంపై నెమ్మదిగా రుద్దుతూ మస్సాజ్ చేసుకోవాలి.ఐస్ ట్రేలలో వేయగా మిగిలిపోయిన నీటిని ఏదైనా స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిజ్లో పెట్టుకుని అవసరమైనప్పుడు ముఖంపై, చేతులపై స్ప్రే చేసుకుంటే చర్మం చాల అందం గా మారుతుంది.