ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అన్న రొమాంటి లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే అఖిల్ కి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, “మనసా” అన్న లిరికల్ సాంగ్ రిలీజై అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసిన అఖిల్ కి మంచి కమర్షియల్ హిట్ దక్కలేదు. అయితే ఈ సారి మాత్రం బ్లాక్ బస్టర్ పక్కా అన్న నమ్మకంగా చిత్ర యూనిట్ మొత్తం ఉన్నారట. ముఖ్యంగా అఖిల్ పూజా హెగ్డేల మధ్య సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన క్వారంటైన్ పోస్టర్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం అక్కినేని సమంత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. అఖిల్ తో కలిసి ఎక్కువ సేపు స్క్రీన్ మీద సందడి చేయబోతుందని అంటున్నారు. అంతేకాదు అఖిల్ ని మోటివేట్ చేసే విధంగా సమంత పాత్ర ఉంటుందని అక్కినేని అభిమానులు ఖచ్చితంగా థ్రిల్ ఫీలవుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
ఇక ఇప్పటికే సమంత.. నాగార్జున నటించిన మన్మధుడు 2 లో గెస్ట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అంతేకాదు నాగార్జున, సమంత కలిసి రాజుగారి గది సీక్వెల్ లో నటించారు. ఇప్పుడు అఖిల్ కోసం సమంత “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్” లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతుందని అంటున్నారు.