మన కళ్ల నుంచి కన్నీరు కేవలం మనం ఏడ్చినప్పుడు మాత్రమే కాకుండా, మనసు బాధ పడినప్పుడు, లేదా ఏదైనా గాయం తగిలినప్పుడు, దుమ్ము ధూళి వంటి పదార్థాలు మన కంటిలో పడినప్పుడు కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉంటాయి. అయితే మన ఇళ్ళల్లో కొందరు చిన్న చిన్న విషయాలకే బాధపడే కళ్ళ వెంబడి నీరు పెట్టుకుంటారు. వారిని చూస్తే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు, ఇలా ఏడవడం ఇంటికి చాలా అరిష్టమని చెబుతారు. కానీ నిజానికి ఏడవడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయని మీకు తెలుసా? మనం ఏడ్చినప్పుడు కళ్ల నుంచి నీరు కారడం వల్ల ఎలాంటి లాభాలు పొందుతామో, ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా మన కళ్ళ వెంబడి మూడురకాల కన్నీరు బయటికి వస్తాయి అందులో ఒకటి బాసల్ టియర్స్, వీటినే కళ్లను శుభ్రం చేస్తే కన్నీరు అని కూడా పిలుస్తారు. ఈ కన్నీరు నిమిషానికి దాదాపుగా రెండు మైక్రో లీటర్ల దాకా ఉత్పత్తి చేస్తాయి. ఇది మన కంటిలో ఉండటంవల్ల మన కళ్ళు ను ఎప్పుడూ తేమగా ఉంచడమే కాకుండా, కళ్ళల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్ల నుంచి మన కళ్ళను కాపాడుతాయి.
రెండవది రిఫ్లెక్స్ టియర్స్ ఈ కన్నీళ్లు మనం బయటికి వెళ్లినప్పుడు మన కళ్లల్లో దుమ్ము ధూళి పడినప్పుడు లేదా ఇంట్లో ఉల్లిపాయలను కోసేటప్పుడు మన కళ్ళలో నుంచి ఈ కన్నీరు కారుతాయి. ఇలా ఈ కన్నీరు కారడం వల్ల దుమ్ము, ధూళి కణాలను, మంటల నుంచి మన కళ్ళను కాపాడుతాయి.
మూడవ రకం కన్నీళ్లను భావోద్వేగ కన్నీళ్లు లేదా ఎమోషనల్ టియర్స్ అని పిలుస్తారు. కొంతమంది కొన్ని సంఘటనలకు ఎంతో భావోద్వేగానికి గురవుతుంటారు. ఈ కన్నీళ్లు బయటకు రావడం వల్ల మన మనసులో ఉన్న బాధ తొలగిపోయి, మనసు తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది ఎక్కువ భావోద్వేగానికి గురై ఏడుస్తున్నప్పుడు వారిని కొద్దిసేపు ఇవ్వండి అని అనడం వినే ఉంటారు. అలా ఏడవడం వల్ల వారిలోనే ఒత్తిడి మొత్తం తగ్గిపోయి, వారి మనసులో ప్రశాంత వాతావరణం సంతరించుకుంటుంది. ఎక్కువ సేపు ఏడవటం వల్ల మన శరీరంలో ఆక్సిటోసిన్,ఎండోజెనస్ ఒపియడ్స్ ఎక్కువగా విడుదల అవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయని,యేలే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.