Pregnant: ఇదివరకటి కాలంలో ఒక్కొక్క స్త్రీ 5 నుండి 10 మంది పిల్లలకు జన్మనిచ్చే వారు. పైగా అవన్నీ నార్మల్ డెలివరీ లు కావడం మరో విశేషం. అసలు అప్పుడు ఆపరేషన్ అనే పదమే వారికి తెలిసేది కాదు. ఇప్పుడు డెలివరీ అనగానే సిజేరియన్ జరుగుతుంది. అసలు ఈ తేడా ఎందుకు వచ్చింది?అప్పటి వారికి , ఇప్పటి వారికి తేడా ఏంటి? అనేది తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చపాతీలు చేయాలనుకుంటే రెడీ గా ఉన్న పిండి కలిపి గుండ్రంగా చేసి పెనం మీద వేసి కాలిస్తే సరిపోతుంది. పప్పు వండాలంటే, కొన్న పప్పుని నానబెట్టి, కుక్కర్ లో పెట్టి గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తే పప్పు తయారయిపోతోంది. కానీ పూర్వం ఇలా ఉండేది కాదు. పప్పు కావాలన్నా, పిండి కావాలన్న కూడా తిరగలి పట్టవలసిందే. కాబట్టి రోజుకో సారి అయినా ఏదో ఒకటి తిరగలిలో వేసి విసర వలసి వచ్చేది . అప్పటి ఆడవారు అంత శ్రమ పడుతూ తమ కుటుంబానికి ఆత్మీయమైన వంటలు చేసి పెడుతూ తమ ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకునేవారు.
అయితే తిరగలి ని వాడుతుంటే నార్మల్ డెలివరీ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తిరగలి తో విసిరేటప్పుడు, పొట్ట మీద ఒత్తిడి కలిగి ఈ సమయంలో పొట్టలో సంకోచ వ్యాకోచాలు సంభవిస్తుంటాయి. దానితో పాటు పొట్టలో ఉండే గర్భసంచికి కూడా కదలిక అనేది ఉంటుంది. పైగా నడుము పై భాగం అంతా గుండ్రంగా తిరగడం వల్ల, పక్కటెముకలు ఫ్రీ గా మారతాయి. ఈ కారణాల వలన కూడా డెలివరీ సమయంలో సిజేరియన్ వరకు వెళ్లే అవసరం లేకుండా, సహజ ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా పుట్టిన పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారు. పూర్వం సిజేరియన్ అనేదే లేకుండా ఒక్కొక్క తల్లి గంపెడు మంది పిల్లలకు జన్మనివ్వడానికి ఇదే అసలైన కారణం.
కడుపుతో ఉన్నవారు 6-7 నెలల వరకు తిరగలిలో వేసి విసర వచ్చు.
తిరగలి వాడడం వల్ల అధిక బరువు కూడా తగ్గిస్తుంది.
ప్రతి రోజు తిరగలి వాడే ఆడవారికి మోనోపాజ్ సమస్యలు వేధించవు.
తిరగలి వాడడం వల్ల… వంటలు రుచిగా ఉండటం తో పాటు ,నడుము,మోకాలు,మెడ ,భుజం నొప్పి సమస్య అనేది ఉండదు.
BP, షుగర్ వ్యాధులకు కూడా ఇది ఒక మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.