ఆయుర్వేదం తెలిపిన కొన్ని ముఖ్యమైన అంశాలను మనిషి ప్రతి రోజు పాటిస్తుంటే నిత్యం ఆరోగ్యవంతుడిగా జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆయర్వేద నిపుణులు. ఆయుర్వేద చికిత్సా విధానం లో తెల్లవారు ఝామున బ్రహ్మ ముహూర్తం లో నిద్ర మేల్కొన్నప్పటినుండి, రాత్రి పడుకునే వరకు సమయాన్ని ఎలా గడపాలి, దీని కొరకు మనిషి తన దినచర్యను ఎలా రూపొందించుకోవాలి అనేది ఇందులో ప్రధాన అంశాలు.
సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలనుకునే వారు ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తం లోనే నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందు అంటే దాదాపుగా 2-3గంటల ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ మూహూర్తంగా చెప్తారు.
ఆ సమయంలో చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఉంటుంది. రోజూ ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల మానసిక, శారీరిక, ఆధ్యాత్మికపరంగా ఎంతో అభివృద్ధిని సాధించడానికి ఎంతో అనువైన సమయం. వ్యాయామం,భగవధ్యానం, సత్ గ్రంధ పఠనం, వంటివి చేయడంవలన అన్ని విధాలుగానూ అభ్యున్నతిని పొందవచ్చు..
ఈ సమయంలో నిద్రలేచే వారు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటారు. విద్య, తేజస్సు, బలం, ధనం ఎప్పుడు సమృద్ధిగా ఉంటాయి. సూర్యోదయం తర్వాత కూడాఎవరైతే నిద్రపోతుంటారో వారి శరీరంలోని శక్తి నశించడం తో పాటు,ఆయుష్షు క్షీణిస్తుంది.ఇలాంటి వ్యక్తులు రకరకాల జబ్బుల తో బాధపడక తప్పదని ఆయుర్వేద వైద్యం చెబుతోంది.
అలాగే ప్రాతఃకాలం నిద్ర లేచిన తర్వాత మలమూత్రాదులను విసర్జించే ముందుగా చల్లటి నీటి ని తాగాలి. రాత్రి పడుకునే ముందు ఒక రాగి పాత్రలో నీటిని నింపి నిల్వ చేసుకోవాలి. నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని తాగితే ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర లేచిన తర్వాత కనీసం అరలీటరు వీలైతే ఒక లీటరు నీటిని తాగితే మరీ మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇలా నీటిని తాగడం వలన శరీరంలోనున్న వాయు, కఫం, పిత్త దోషాలు పోతాయి. దీంతో మనిషి బలశాలి, దీర్ఘ ఆయుఃషుతో బ్రతుకుతాడు. ఉదరం అంతా పూర్తిగా శుభ్రంఅవుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?