యోగా చేసేటప్పుడు కాళ్లను మడతపెట్టు కొని కూర్చోవడాన్ని సుఖాసనం అంటారు. దీని వల్ల కండరాలు సాగి మనసు ప్రశాంతం గా ఉంటుంది. నేలపై కూర్చొని తింటే తిన్న ఆహారం బాగా జీర్ణమవడం తో పాటు సరిపడా మాత్రమే తీసుకుంటారు.నేలపై కూర్చునే అలవాటు ఉన్నవారికిపాదాలు, మోకాళ్లు, కాళ్లు, వెన్నెముఖ అన్నీ బాగా పనిచేస్తాయి.
ఇప్పుడు ఉద్యోగాల పేరుతో డెస్కుల దగ్గర కుర్చీల్లో గంటల తరబడి కూర్చొవాలిసి వస్తోంది. దీని బదులు నేలపై కూర్చునేలా ఏర్పాటు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు . ఒకేలా ఎక్కువ సేపు కూర్చుంటే,వెన్నెముఖపై ఒత్తిడి పెరిగి నడుంపైనా భారం పడుతుంది. అలా జరగడం వలన దీర్ఘకాలం లో ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అదే నేలపై కూర్చుంటే అరగంటకోసారి అయినా యాంగిల్స్ మార్చుకోవడానికి కుదురుతుంది. దీని వలన ఒత్తిడి అన్నదే ఉండదు. ఎన్నో పరిశోధనలలో నేలపై కూర్చోవడమే మేలని తేలింది.
పిల్లలకు ఎదిగే వయసు కాబట్టి… వాళ్లను నేలపైనే కూర్చోబెట్టాలని నిపుణులు చెబుతున్నారు.దానివలన ఆసన సిద్ధి కలిగి వారి కండరాలు సాగుతూ… త్వరగా ఎదుగుతారని అంటున్నారు. కుర్చీల్లో కూర్చునేవారికి… నడుం చుట్టూ కొవ్వు పేరుకొని… రింగులాగా తయారవుతుంది. ఆ తర్వాత పొట్ట పెరిగి అధిక బరువు పెరుగుతారు. దానివలన గుండె సమస్యలు, బీపీ, షుగర్, వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. పొట్ట రాకుండా ఉండాలంటే నేలపై న కూర్చొవాలసిందే అంటున్నారు నిపుణులు.
కొంత మంది నేలపై కూర్చున్నట్లుగా కుర్చీల్లో, సోఫాల్లో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటివి ఏమి చెయ్యవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే… లో బ్యాక్ పెయిన్ వస్తుందని కూర్చునే టప్పుడు నిఠారుగా కూర్చోవాలని తెలియచేస్తున్నారు. కింద కూర్చునేటప్పుడు కూడా కాళ్లను మడతపెట్టి, ఒక కాలుపై మరో కాలు వేసుకొని పద్మాసనం లో కూర్చోవడం అన్నింటికంటేమంచి పద్దతి అని అంటున్నారు. తద్వారా మోకాళ్ల కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయంటున్నారు. కాబట్టి వీలున్నంతగా కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి.