PV Sindhu: ఇటీవల జరిగిన ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు కి దేశ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఒలంపిక్స్ గేమ్ ముగించుకుని మొట్టమొదటిసారిగా ఢిల్లీలో అడుగుపెట్టిన ఆమెకు కేంద్ర క్రీడా విభాగం సంబంధిత మంత్రులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించి పీవీ సింధు ని సత్కరించడం జరిగింది. వరుసగా భారత్ మహిళ రెండుసార్లు గత వారం పిక్స్ తర్వాత ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్ లో మెడల్ సాధించడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కచ్చితంగా నెక్స్ట్ ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించడం గ్యారెంటీ అని అంటున్నారు. హైదరాబాద్ లో కూడా అడుగడుగునా పీవీ సింధు కి ప్రజలు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి ఇటీవల చేరుకునే క్రమంలో రెండు తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా స్వాగతించడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు.. ఇచ్చిన ఇంటర్వ్యూలో పీవీ సింధు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
2016వ సంవత్సరంలో సిల్వర్ మెడల్ రావడంతోనే తన దశ మారిపోయిందని, అటువంటిది రెండోసారి కూడా ఒలంపిక్స్ లో పథకం రావటం అనేది మామూలు విషయం కాదని… తన కళ వరుసగా రెండు సార్లు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు తెలిపింది. ముఖ్యంగా రెండోసారి చాలా అంచనాలు ఉండటం మాత్రమే కాక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని.. కానీ పేరెంట్స్ సపోర్ట్ తోనే తాను రాణించడం జరిగిందని పేర్కొంది. ఇదిలా ఉంటే తనకు ఇష్టమైన వంటకం చేపల పులుసు.. ముఖ్యంగా తన తల్లి చేసే పులస చేప కూర అంటే మహా ఇష్టం.. త్వరలోనే కుటుంబ సమేతంగా అందరం కలిసి తన తల్లి చేసిన వంట గాని ఆస్వాదించడం జరుగుతుందని, ప్రస్తుతం హడావిడి గా ఉందని పి.వి.సింధు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.