ప్రముఖ నిర్మాత దిల్ రాజు 2020 లో ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అంటే వకీల్ సాబ్ మాత్రమే. ఈ సినిమాకోసం ముందు నుంచి ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా ఎంత కావాలన్న పెట్టేస్తున్నాడు. అందుకు ఒక్కటే కారణం. కొన్నేళుగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్నది దిల్ రాజు కి ఉన్న పెద్ద డ్రీం. అందుకే ఈ పదేళ్ళలో ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రయత్నించి ఎట్టకేలకి సాధించాడు. ఇక రెండు సంవత్సరాలు సినిమాలు చేయని పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు మానేస్తాడన్న అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు ప్రేక్షకులు.
కాని అనూహ్యంగా వకీల్ సాబ్ సెట్ లో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన ఊపుకి ఈ సినిమా మే15 రిలీజ్ అని దిల్ రాజు గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కాని కరోనా మొత్తం సర్వనాశనం చేసింది. అయితే ఇప్పుడు ఆగస్టు 15 న రిలీజ్ చేయాలని అనుకుంటున్నప్పటికి సినిమా రెడీ అయినా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందా..థియోటర్స్ ఓపెన్ అవుతాయా ..అయినా జనాలు వస్తారా..ఇలా చెప్పలేని కారణాలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు లాక్ డౌన్ తో చిత్రీకరణలు నిలిచిపోవడం ఒక కారణం అయితే బిజీగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ మిగిలిన వకీల్ సాబ్ చిత్రీకరణకి డేట్స్ ఎప్పుడు ఇస్తారన్నది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫినిష్ చేయడానికి పవన్ కళ్యాణ్ వరసగా డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో సెట్ తయారవుతుంది. ఈ సెట్ రెడీ కాగానే పవన్ కళ్యాణ్ తను చేయాల్సిన సీన్స్ మొత్తం ఫినిష్ చేస్తారట. అప్పటి వరకు వేరే పని పెట్టుకోరని అంటున్నారు. అదే గనక జరిగితే ఇక మిగిలిన వకీల్ సాబ్ పనులన్ని చక చకా అయిపోతాయి. అయితే ఎంత చక చకా అయినా ఈ ఇయర్ రిలీజ్ చేయడం మాత్రం కష్టమే అని అంటున్నారు. రిలీజ్ వరకు వీలైనంతగా సినిమాని ప్రమోట్ చేస్తూ ఉండాలి. బాగా బజ్ క్రియోట్ చేయాలి…అంతే.