నందమూరి కళ్యాణ్ రాం హీరోగా నటించిన అతనొక్కడే సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయమయ్యాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించింది. అంతేకాదు దర్శకుడిగా సురేందర్ రెడ్డికి మంచి పేరు తెచ్చి పెట్టడం తో పాటు హీరోగా కళ్యాణ్ రాం కి లైఫ్ ఇచ్చింది. నందమూరి ఫ్యామిలీ బాగా ఇంప్రెస్ చేసిన సురేందర్ రెడ్డి ఆ సినిమా కళ్యాణ్ రాం సోదరుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో అశోక్, ఊసరవెల్లి లాంటి సినిమాలు తెరకెక్కించాడు.
మహేష్ బాబు తో అతిథి, రవితేజ తో కిక్, కిక్ 2.. అల్లు అర్జున్ తో రేసుగుర్రం, రాం చరణ్ తో ధృవ సినిమాలు తీశాడు. ముఖ్యంగా ఊసరవెల్లి, కిక్, రేసుగుర్రం, ధృవ సినిమాలతో స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి పేరు సంపాదించుకున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో తీసిన ధృవ సినిమా చూసిన మెగాస్టార్ తన డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కి సురేందర్ రెడ్డి దర్శకుడు అనగానే చాలామంది ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. అయినా చరణ్, చిరు .. సూరి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు సూరి. సైరా మంచి సక్సస్ ని అందుకుంది. అయితే సైరా వల్లే పవర్ స్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకుంటాడని మాత్రం ఎవరూ ఊహించలేదు.
సైరా సినిమాకి పవర్ స్టార్ తో వాయిస్ ఓవర్ చెప్పించారు సురేందర్ రెడ్డి. మెగాస్టార్ అప్పుడే పవర్ స్టార్, సురేందర్ రెడ్డి కలిసి ఒక సినిమా చేయాలని డిసైడయ్యారట. అయితే ఒక సినిమా కి కథ సిద్దం చేస్తున్నన్ని రోజులు సురేందర్ రెడ్డి చాలా సైలెంట్ గా వర్క్ చేసుకుంటాడు. చిన్న హింట్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు.
అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి చేయబోయో సినిమా విషయంలోను జరిగింది. గత కొన్ని రోజులుగా సురేందర్ రెడ్డి కి హీరో దొరకడం లేదని అందుకే రాం తో తన నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. కనీసం అవన్ని పుకార్లన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. సైలెంట్ గా చూస్తూ వచ్చిన సురేందర్ రెడ్డి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఏకంగా పవర్ స్టార్ తో సినిమా చేస్తున్నట్టు ఆయన బర్త్ డే కి అఫీషియల్ గా అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. ఈ సినిమాని రాం తాళ్ళూరి నిర్మిస్తుండగా వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు.