మహమ్మారి కరోనా కారణంగా 2020 సంవత్సరం అందరికి నష్టాలను మిగిల్చింది.. ముఖ్యంగా కార్ల కంపెనీలకు ఆశించిన లాభాలు రాకపోగా మరింత ముప్పు వచ్చింది.. అయితే కార్ల కంపెనీలు ఆ నష్టాన్ని భర్తీ చేయటానికి వచ్చే సంవత్సరంలో కార్ల రేట్లు పెంచనున్నాయి.. దేశీయ మార్కెట్లో లీడర్ గా ఉన్న మారుతి సుజుకి ఇప్పటికే తన ఉత్పత్తుల ధరలు పెంచినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. మారుతి బాట లోనే ఫోర్డ్, కియా మోటార్స్ వంటి కంపెనీలు కూడా ప్రకటించాయి.. తాజాగా భారత దేశపు అతి పెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఇదే బాటలో తమ ఉత్పత్తుల ధరలను కొత్త సంవత్సరంలో పెంచేందుకు సిద్ధమవుతోంది..!
ఇదిలా ఉంటే హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇయర్ ఎండ్ సేల్ భాగంగా కొన్ని ఎంపిక చేసిన మోడల్ లపై శాంట్రో, గ్రాండ్ ఐ20, గ్రాండ్ ఐ20 నియోస్,ఔరా, ఎలంట్రా మోడల్లపై ఆఫర్ లలో కస్టమర్ ఎంచుకునే మోడల్ని బట్టి కస్టమర్లకు గరిష్టంగా ఒకలక్ష వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా స్మార్ట్ కార్ క్లీనింగ్ సర్వీస్ క్యాంపెయిన్ డిసెంబర్ 14-23 వరకు కొనసాగుతుందని, దేశవ్యాప్తంగా ఉన్న 1288 పైగా అధీకృత సర్వీస్ సెంటర్లు ఈ క్యాంపెయిన్ లో పాల్గొంటాయి. ఈ సర్వీస్ సెంటర్ కు తీసుకువచ్చే వాహనాల సర్వీస్, స్పేర్స్ పై ప్రత్యేక తగ్గింపు కూడా అందిస్తుంది. హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్బ్యాక్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఈ మార్కెట్లో విడుదలైన 40 రోజుల్లోనే 30వేల యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. కొత్త ఐ20 పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.
కొత్త సంవత్సరం 2021లో మోటార్స్ ఇండియా కంపెనీ అందిస్తున్న ప్రొడక్ట్స్ లైన్ లోని అన్ని మోడళ్ల ధరలు కొంతమేర పెంచాలని కంపెనీ భావిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఒక అధికార ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం కూడా ఉంది.కియో మోటార్స్ కూడా 2021జనవరి నాటికి సొనెట్, సెల్టోస్ మోడల్ ధరలు పెంచుతామని ప్రకటించింది. కార్నివాల్ మోడల్ ధర పెంచడం గురించి కంపెనీ ప్రస్తావించలేదు.