సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో గత కొంత కాలంగా బయోపిక్స్ తో సంచలన విజయాలందుకుంటున్నారు మేకర్స్. అంతేకాదు ఈ బయోపిక్స్ ని నిర్మించడానికి వాటిలో నటించడానికి పోటీ కూడా పడుతున్నారు. ఇక ఈ సినిమాలని పాన్ ఇండియా లెవల్లో నిర్మించడంలో కూడా బాగా పోటీ ఎక్కువైపోయింది. రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన పలువురి జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాలకి ప్రేక్షకుల నుంచి ఆదరణ కూడా విపరీతంగా లభిస్తుంది.
చెప్పాలంటే కమర్షియల్ సినిమాల కంటే బయోపిక్స్ ని చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో సూపర్ 30, పాడ్ మాన్, దంగల్, అలాగే తెలుగులో మహానటి, ఎన్.టి.ఆర్ బయోపిక్, వంగవీటి, జార్జి రెడ్డి వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సైనా నెహ్వాల్, కపీల్ దేవ్ బయోపిక్ లాంటి సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతుండగా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2000లో జరిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించడమే కాకుండా ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ క్రియేట్ చేసిన కరణం మల్లేశ్వరి జీవితాన్ని సినిమాగా రూపొందించబోతున్నారని తాజా సమాచారం.
సంజనా రెడ్డి దర్శకత్వంలో కరణం మల్లేశ్వరి బయోపిక్ను పాన్ ఇండియా సినిమాగా ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్.సి బ్యానర్స్పై ఎం.వి.వి.సత్యనారాయణ, కోనవెంకట్ నిర్మిస్తునారు. ఇక కరణం మల్లీశ్వరి పాత్రకు పూజా హెగ్డే, కియారా అద్వాని లతో సంప్రదింపులు జరుపుతున్నారట చిత్ర యూనిట్. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన రానుంది.