టాలీవుడ్ లో సునీల్ కమెడియన్ గా మంచి పాపులారిటీ ని సాధించుకున్న సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో సునీల్ లేకుండా సినిమా ఉండేది కాదు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరోల వరకు దాదాపు అందరూ తమ సినిమాలో సునీల్ ఉండాలని కోరుకున్నారు. ఒకవేళ సునీల్ కి క్యారెక్టర్ లేకపోయినా కూడా హీరోలు ప్రత్యేకంగా తనకోసం ఒక క్యారెక్టర్ రాయించేవాళ్ళు. అంతగా సునీల్ తన కామెడీతో ప్రేక్షకులనే కాదు సినిమా ఇండస్ట్రీలోను ఎంతో మందిని అట్రాక్ట్ చేశాడు.
అయితే ఆ తర్వాత సునీల్ అనూహ్యంగా హీరో అవతారమెత్తాడు. రాం గోపాల్ వర్మ తీసిన అప్పల్రాజు, అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తీసిన మర్యాద రామన్న సినిమాలతో బాగా పేరు పొందాడు. ఈ క్రమంలో మర్యాద రామన్న .. పూల రంగడు.. లాంటి సూపర్ హిట్స్ ని కూడా సునీల్ హీరోగా నటించి అందుకున్నాడు. అందుకే నిర్మాతలు వరసగా సినీల్ తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. వరసగా సినిమాలని కూడా నిర్మించారు. కాని కొన్ని సినిమాలు వరసగా ఫ్లాపయ్యాయి నిర్మాతలకి నష్టాలను తెచ్చిపెట్టాయి. దాంతో సునీల్ కి హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి.
కొంత గ్యాప్ కూడా వచ్చింది. కాగా సునీల్ కి త్రివిక్రం మళ్ళీ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో మంచి కామెడీ రోల్ ఇచ్చాడు. దీంతో మళ్ళీ కామెడీ రోల్ చేస్తూ వస్తున్నాడు. అలాగే రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాతో విలన్ గా కూడా మారాడు. ఇలా కమెడియన్ నుంచి హీరో ఆ తర్వాత మళ్ళీ కమెడియన్ అయిన సునీల్ తాజాగా దర్శకుడిగా మారబోతున్నట్టు సమాచారం. మరాఠీ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దం చేసుకున్నాడట. ఈ సినిమాని సునీల్ తో ఉన్న అత్యంత సన్నిహితుడితో కలిసి స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్నాడని .
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!