తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 730 పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ నిర్మూలనలో వైద్యులు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. కరోనా సోకిన వారి ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా సేవలందిస్తున్నారు.
తాజాగా కరోనా వైరస్ బారిన పడి హైదరాబాదులో ఓ వైద్యుడు మరణించాడు. నగరంలోని ఖైరతాబాద్కు చెందిన ఓ డాక్టర్ అనారోగ్యం కారణంగా ఈ నెల 16న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
ఈ నెల 18న డాక్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆదివారం (జూన్21న) రాత్రి చికిత్స పొందుతూ డాక్టర్ ప్రాణాలు విడిచారు.