విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలుసు. ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయి, తాగి రోడ్డుమీద కి వచ్చి ముఖ్యమంత్రిపై, మరికొన్ని వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చ రచ్చ చెయ్యటం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో డాక్టర్ సుధాకర్ అరెస్టు దాకా వెళ్లడంతో అప్పట్లో ఏపీ రాజకీయాల్లో కలకలం గా మారింది. ఈ తరుణంలో ఈ విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ సుధాకర్ ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన అనేక సంచలన కరమైన విషయాలు వెల్లడించారు.
విశాఖ 4 టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన డాక్టర్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన తర్వాత ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పుకొచ్చారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వాని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. వైఎస్ అంటే తనకు ఎనలేని అభిమానం అని, వైయస్ జగన్ దేవుడు అని చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంపై నాకెంతో అభిమానం ఉందని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రలో తాను కూడా పాల్గొన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తనని మానసిక రోగిగా చిత్రీకరించి కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు రాజకీయ నాయకులను ప్రభుత్వాలను విమర్శించే స్థాయి నాకు లేదు. శత్రువులను కూడా కనీసం పల్లెత్తు మాట అనే స్వభావము నాది కాదని తెలిపారు. ప్రధాని మోడీ అంటే ఎంతో అభిమానం అని స్పష్టం చేశారు. ఇక గుండు గురించి మాట్లాడుతూ..నాకు గుండు గీసిందెవరో వారి పేరు చెప్పనని… చెప్పానంటే మళ్లీ గొడవ మొదలవుతుందన్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్యోగం చేస్తున్నా… జీతం రాక ఇంట్లో ఇబ్బంది పడుతున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉన్నా తన గుండు గురించి సస్పెన్స్ పెడుతూ సుధాకర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో వైరల్ కామెంట్స్ గా మారాయి.