డెంగీ ఈ పేరు వినగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. శరీరంలో ప్లేట్లెట్లు తగ్గిపోయి.. మనిషి నీరసంగా తయారవుతాడు. ప్రస్తుతం అందరినీ భయపిస్తున్న జ్వరం ఇదే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం. సాధారణంగా దోమ కాటు ద్వారా డెంగీ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఐదారు రోజుల్లో డెంగీ జ్వరం లక్షణాలు మనలో కనిపిస్తాయి. అకస్మాత్తుగా తీవ్రజ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఒళ్లు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. వాంతులవుతాయి. ఆకలి వేయదు. మొదట ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల ఏ లక్షణాలతో జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డెంగీ యాంటిజెన్ పరీక్ష (ఎన్.ఎస్-1) చేయించుకుని నిర్ధారించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా జ్వరం వచ్చిన మొదటి రోజే అది డెంగీనో కాదో అనే విషయం తేలిపోతుంది.
ఒకవైపు సీజనల్ వ్యాధులు, మరోపక్క కరోనా ప్రజలను వేదిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ, కరోనాతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ సమయంలో ఈ రెండు ఒకేసారి వస్తే చికిత్స అందించడంవైద్యులకు సవాల్ గా మారిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని ఎలా ఎదుర్కోవాలో దానిపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రెండింటిలోనూ ఎటువంటిలక్షణాలు కనిపించలేదని చెప్పారు. ఇవి తీవ్రమైతే మాత్రం ఆసుపత్రిలో చేరు చేర్చాల్సిన స్థితి వస్తుందని కాబట్టి వేగంగా చికిత్స అందించడమే ముఖ్యమని తెలిపారు. రెండింటిలోనూ నిర్దిష్టమైన చికిత్స లేనందున వైద్యుని సమక్షంలో లక్షణాలను కు అనుగుణంగా చికిత్స పొందాల్సి ఉంటుంది. అంతేకాక రెండింటికీ వేరువేరు చికిత్స చేయాలి డెంగీలో ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తారు, కరోనా వాటిని ఇవ్వడం ద్వారా అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఊపిరితిత్తుల వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే కరోనా రోగుల్లో రక్తం గడ్డ కట్టకుండా మందు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దీనిని డెంగ్యూ రోగుల్లో ఇస్తే రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్లో కరోనా, డేంగీ బారిన పడకుండ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం కోరింది.అపరిశుభ్రత వల్లే దోమలు విజృంభించి, డెంగీ ప్రబలుతుంది. అందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయటికి వెళ్లేటపుడు మాస్క్ ధరించాలి. చేతులను శుభ్రంగా కడుకోవడం , సామజిక దూరం వంటి కరోనా నివారణ చర్యలు పాటించాలి.