ఇండియాలో అతి పెద్ద ఎంటర్టైనింగ్ రియాలిటీ షోస్ లో ‘బిగ్ బాస్’. హిందీతో పాటు తమిళంలోను ఈ రియాలిటీ షో కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఈ రియాలిటీ షోని తెలుగులోను మొదలు పెట్టారు. ఇప్పటికే 3 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ కి తెలుగు ప్రేక్షకుల్లోను భారీ సినిమా రేంజ్ పాపులారిటి వచ్చింది. కొత్త సీజన్ మొదలవబోతున్న ప్రతీసారి ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంటుంది.
ప్రతీ సీజన్ కి ఎన్నో వివాదాలు చుట్టుకుంటున్న యాజమాన్యం మాత్రం లెక్కచేయకుండా సీజన్ ని కొనసాగిస్తున్నారు. ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ ఆధారంగా విజేతను నిర్ణయించే ఈ షోలో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ లో హీరో శివబాలాజీ విన్నర్ గా నిలిచారు. సీజన్ 2లో యాక్టర్ కౌశల్ మండా సీజన్ 3లలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ టైటిల్ గెలుపొందారు.
ఇక త్వరలో మొదలవబోయో సీజన్ 4 లో ఇండస్ట్రీతో పాటు బుల్లితెర మీద పాపులారిటీని సాధించిన చాలా మంది ప్రముఖులను పార్టిసిపేట్ చేయించడానికి ‘స్టార్ మా’ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ లో పాల్గొనే వారు వీరేనంటూ చాలా మంది సెలబ్రిటీస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే సింగర్ గీతా మాధురి భర్త హీరో నందు – యాంకర్ ఝాన్సీ – సింగర్ సునీత – కమెడియన్ తాగుబోతు రమేష్ – బిత్తిరి సత్తి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అయితే ఇంకా అఫీషియల్ గా ఎవరిని ఫైనల్ చేశారన్నది తెలియలేదు. అంతలోనే మరో రెండు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆ పేర్లే రష్మీ గౌతం,సుడిగాలి సుధీర్. బుల్లి తెరమీద ఈ జంటకి ఉన్న పాపులారిటీ అసాధారణం. షోలో రష్మీ సుధీర్ చేసే పర్ఫార్మెస్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఈ ఇద్దరు సినిమాలలోను నటించి ఉన్నారు. రష్మీ గ్లామర్ సుధీర్ యాటిట్యూడ్ అండ్ టైమింగ్ సూపర్బ్. దాంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 లో దాదాపు సినిమా రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకోవాలని చూస్తున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.