పోలవరం ప్రాజెక్టు. ఏపీ ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష. ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం, మాజీ సీఎం చంద్రబాబు ఆకాంక్ష కూడా.
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం. అయితే ఈ ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. నిధుల కొరత సహా పలు అంశాలు దీనికి కారణాలు. ఈ ప్రాజెక్టు విషయంలో తాజాగా కీలక అంశం తెరమీదకు వచ్చింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేస్తామని ప్రకటించారు. కొద్దిరోజుల క్రితమే పోలవరం పునరావాస పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై అధికారులు వివరాలు ఇచ్చారు. కోవిడ్ సమయంలో కూడా పనులు జరిగాయని, సెప్టెంబర్ 15కల్లా స్పిల్ వే పిల్లర్స్ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. వర్షాకాలంలోనూ పనులు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నామని అధికారులు చెప్పారు. పోలవరం పునరావాస కార్యక్రమాల్లో నాణ్యతపై దృష్టిపెట్టాలని జగన్ సూచించారు.
ఓ వైపు ఇలా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనుల విషయంలో తన పంథాను కొనసాగిస్తుంటూ మరోవైపు ఈ ఎపిసోడ్లోకి కేంద్రం ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలవరం పనులు ఆశించినంతా వేగంగా జరగడం లేదని కేంద్రం భావిస్తోందని సమాచారం. దీంతోపాటుగా ఏపీలోని ఓటర్లను ప్రభావితం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు కీలకమైన అంశం కాబట్టి దాన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల పై పట్టు సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చు అన్న ఆలోచన బీజేపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంత నిజం తేలాలంటే…మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.