కర్ణాటక నుండి దేవాదుల పైపుల నిర్మాణం కోసం వచ్చిన వలస కూలీల కుటుంబానికి చెందిన ఒక ఆరేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందాడు.
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా లోని దేవర పట్నం లో ఆరేళ్ల బాలుడు అన్యాయంగా వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు వదిలాదు. తల్లిదండ్రులు కూలిపనులకు ఇంటినుండి బయటికి వెళ్లినప్పుడు వీధికుక్కలు అతనిపై దాడి చేశాయి. దీనితో తీవ్రంగా గాయపడిన పిల్లాడికి విపరీతమైన రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఈ అమానుష ఘటన బాలుడి తల్లిదండ్రులను కలిచివేసింది. ఇక దీనితో తాత్కాలికంగా నిర్మాణ పనులు నిలిపివేయగా చిన్నారి మృతదేహాన్ని ఈ కరోనా సంక్షోభ సమయంలో సొంత ఊరికి తీసుకొని వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు.