కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి. ఈ వైరస్ రాకతో అన్ని మారిపోయాయి. జీవిన విధానం పూర్తిగా మారిపోయింది. ఏం చేయాలన్నా.. ఇంటికే పరిమితమై చేయాల్సి వస్తోంది. కాదు కూడదు అంటే కరోనా కాటుకు బలి కావాల్సిందే. ఇప్పటికే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ స్టార్ట్ అయిందని వైద్యులు చెబుతున్నారు. ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అందులో ఇప్పుడు చలికాలం కావడం దీని వల్ల వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
అందుకే మరింత జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు. దాంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉద్యోగులు లాక్ డౌన్ నుంచి ఆఫీసులకు పోవడంలేదన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కొన్ని కంపనీలు ఆఫీసులకు పక్కాగా రావాలని అంటున్నాయి. ఉద్యోగం లేకున్న సరే కానీ ఆఫీసులకు మాత్ర రాలేమని చాలా మంది ఉద్యోగులు చెప్పేస్తున్నారు.దాంతో కంపనీలు చేసేదేమీ లేక వర్క్ ఫ్రం హోం ను కొనసాగిస్తున్నాయి.
అయితే ఈ వర్క్ ఫ్రం హోం వల్ల కూడా మనుషులకు రోగాలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రోగాల వల్ల ప్రజలంతా క్షణక్షణం భయపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ రోగం నుంచి బయట పడేందుకు చాలా మంది శస్త్రచికిత్సలను చేయించుకునేందుకు కూడా వెనకాడటం లేదని తెలుపుతున్నారు.
వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు, ఉన్నతాధికారులు తమ క్లయింట్లతో మాట్లాడేందుకు జూమ్ వంటి యాప్ ల ద్వారా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ వల్ల చాలా మంది ఉద్యోగుల్లో జూమ్ డిస్మోర్ఫియా అనే వ్యాధి పెరిగిపోతుందంట. ఈ వ్యాధికి కారణం శరీరం, ముఖంలో లోపాలు ఉండటమే నంట. దానివల్ల వాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారంట. అలాగే మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారంట. ఈ వ్యాధినే డిస్మోర్ఫియా అంటారని వైద్యులు తెలుపుతున్నారు.
వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు తమ ముఖంలోని లోపాలను చూసుకుని మానసికంగా క్రుంగిపోతున్నారట. వాటిని అధిగమించేందుకు శస్త్రచికిత్సలను కూడా చేయించుకుంటున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకు ముందు ఆఫీసులకు వెళ్లి పనులు చేసేవారు కాబట్టి ఈ విషయాలను పట్టించుకునేవారు కాదట. కానీ ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ వల్ల ముఖాన్ని చూడాల్సి రావడంతో తమ ముఖంలోని లోపాలు కనబడతాయని బయపడుతున్నారంట. దాంతో అందాన్ని ఎలా పెంచుకోవాలో అని సెర్చ్ చేస్తున్నారంట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?