Brushing:ఉదయం లేవగానే పళ్ళు తోముకున్న తర్వాతే అందరూ తమ తమ పనులు ప్రారంభిస్తారు. ఇక రాత్రి తినడం అంతా అయిపోయి పడుకునే టప్పుడు మళ్లీ బ్రష్ చేసిన తర్వాత నిద్రపోతారు.ఉదయం నిద్రలేచిన తర్వాత, మళ్ళి రాత్రి పడుకునేముందు ఇలా రెండుసారులు బ్రష్ చేయడం చాలా మందికి ఉన్న ఒక మంచి అలవాటు. అయితేకొందరు మాత్రం భోజనం చేసిన ప్రతిసారి బ్రష్ చేస్తూనే ఉంటారు.
భోజనం ముగించిన ప్రతిసారీ ఇలాబ్రష్ చేయడం మనలో కొంత మందికి అలవాటు గా ఉంటుంది. కానీ ఆ అలవాటు మంచిది కాదని నిపుణులు తెలియచేస్తున్నారు.ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రచురించిన నివేదిక తెలియచేసిన దాని ప్రకారం.. భోజనం చేసిన ప్రతిసారి బ్రష్ చేయాల్సి అవసరం ఏమాత్రం లేదు. ఉదయం, రాత్రి ఈ రెండు సార్లు చేస్తే సరిపోతుంది అని వివరించింది.
ఎక్కువ సార్లు పళ్లు తోమిన.. ఎక్కువ సేపు తోమినా.. పళ్ల పైపొరగా ఉండే ఎనామెల్ దెబ్బతింటుంది. అది సెన్సిటివిటీ, దంతక్షయానికి కారణం అవుతుంది. గట్టి బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ,చిగుళ్ల ని డ్యామేజ్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. చక్కగా స్మూత్ గా ఉండే బ్రష్ లు వాడటం ఉత్తమం. రోజుకు కనీసం 2 నిమిషాల పాటు అయినా బ్రషింగ్ చేసుకుంటూ ఉండాలి. దంత నలుమూలలను శుభ్రం గాబ్రష్ చేయాలి. లోపల, బయట క్లీన్చేస్తూ ఫ్లాసింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. అలా చేయడంవలన దంతాల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలను పూర్తిగా తొలగిస్తుంది.
మౌత్ వాష్ యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండడం వలన నోట్లో ఉండే బాక్టీరియాను అరికడుతుంది. దంత సమస్యలు ఉన్నా లేకున్నా డెంటిస్ట్లను తరచూ కలిసి వారిచ్చిన సలహాలు ,సూచనలు తప్పకుండా పాటించాలి. కాఫీ, టీ, డ్రింక్స్ తాగిన తర్వాత సాప్ట్గా బ్రష్ చేయడం మంచిది. లేదంటే వాటిలో ఉండే ఆమ్లాలు పళ్లపై పొరను దెబ్బతీసాయి. క్రమంగా పళ్ళు పుచ్చి పోవడానికి కారణం అవుతుంది. రాత్రి భోజనం చేసిన వెంటనే పళ్లు తోమ కూడదు. ఒక అరగంట గడచిన తర్వాత మాత్రమే బ్రష్ చేయడం మంచిది . అప్పుడే పళ్లపై యాసిడ్ స్థాయి తగ్గుతుంది.