గోరువెచ్చని నీటిని ప్రతిరోజు పరగడుపున తాగడం వలన శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని అధ్యయనాలు,డాక్టర్లు కూడా తెలియచేస్తున్నారు. గోరువెచ్చని నీళ్లు శరీరంలోని విష వ్యర్థాలను ను బయటకు పంపడం తో పాటు జీర్ణ శక్తిని,రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి.
పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి జలుబు, దగ్గు,శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కడుపు నొప్పితో ఇబ్బంది పడేవారు కచ్చితం గా బ్రేక్ ఫాస్ట్ కు ముందు గోరువెచ్చని నీరు తాగితే ఆ సమస్య మాయమవుతుంది.
గోరువెచ్చని నీళ్లు శరీరంలోని అవయవాలను శుభ్రం పడేలా చేస్తాయి. అయితే నీటిని వేడి చేస్తుకున్నాక చాలా వేడిగా ఉన్నాయి అని తాగేందుకు సరిపడా వేడి కోసం కొద్దిగా మామూలు నీరు కలిపితే మాత్రం ప్రయోజనం వుండదని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. కాచిన నీళ్లు మరీ వేడిగా ఉన్నాయి,అని అందులో చల్లని నీళ్లు పోస్తే ఎలాంటి ఫలితం కనిపించదు అని గుర్తుపెట్టుకోండి.
వేడి వేడి నీటిని కప్పు లోకి తీసుకుని కాసేపు చల్లారిన తర్వాత తాగడం వలన శరీరంలోని వ్యర్థాలు పోతాయి. కానీ ఆ వేడి నీటిలో చల్లని నీరు కానీ వేడి చేయని నీటిని కానీ చేర్చి తాగడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండకపోవడం తో పాటు శరీరంలోని మలినాలు కూడా పోవు . అందుకే వేడి నీటిని కాసేపు చల్లార్చుకుని తర్వాత తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. రోజూ వేడి నీళ్లు తాగడంవలన జలుబు, దగ్గు, ఆయాసం కడుపు ఉబ్బరం ఎక్కిళ్లు, తగ్గుతాయి పార్శ్వపు తలనొప్పి తలనొప్పి, ఇతర ఉదర రోగాలు కూడా తగ్గుతాయి.
రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడి నీళ్లు తాగితే, వాతం, దగ్గు తగ్గడం తో పాటు తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. షుగర్ ఉన్నవారు కూడా రోజూ వేడి నీళ్ళు తాగడం వలన తిన్న ఆహారం బాగా జీర్ణం కావడం తో పాటు, క్లోమగ్రంథి పనితీరు బాగుంటుంది. షుగరు కూడా నియంత్రణలో ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.