Curd: ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు మెయిల్ చేస్తుంది. శరీరాన్ని త్వరగా చల్లబరుస్తుంది. పెరుగులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది.. అధిక రక్తపోటు సమస్య తో బాధపడేవారు పెరుగు తినడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న పెరుగు వల్ల కూడా.. కొన్ని పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యానికి చేటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! మరి ఎటువంటి ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..!!
* పాల నుంచి పెరుగు తయారు అవుతున్నప్పటికీ.. పాలు, పెరుగు రెండు కలిపి ఒకేసారి తీసుకోకూడదు. ఈ రెండింటిని కలిపి తింటే డయేరియా, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
.*చేపలు తిన్న వెంటనే పెరుగు తినకూడదని పెద్దలు సూచిస్తున్నారు. చేపలు తో పాటు పెరుగు తింటే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు బాధిస్తాయి.
*పెరుగు అన్నంలో మామిడికాయ ను కలిపి తినకూడదు. ఇలా ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన చర్మ సమస్యలు, అలర్జీ వస్తాయి.
*చాలామంది పెరుగన్నంలో ఉల్లిపాయలను కలిపి తీసుకుంటారు. పెరుగన్నం శరీరాన్ని చల్లబరిస్తే, ఉల్లిపాయ వేడిని కలిగిస్తుంది. ఈ రెండింటినీ కలిపి తినటం వల్ల సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.